Iran-US Talks: అమెరికాతో చర్చలపై మోజ్తాబా సంచలన నిర్ణయం! సర్వత్రా ఉత్కంఠ
- అమెరికాతో చర్చలపై మోజ్తాబా సంచలన నిర్ణయం!
- సోమవారం రాత్రి ఇరాన్ బృందానికి కీలక ఆదేశాలు
- ఇస్లామాబాద్ వేదికగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో చర్చలపై ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికాతో చర్చలు జరపాలని ఇరాన్ బృందానికి సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో చర్చలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠ వీడబోతున్నట్లుగా తెలుస్తోంది.
రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగుస్తోంది. ఇంకా 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇస్లామాబాద్ వేదికగా రెండో విడత చర్చలు జరుగుతాయా? లేదా? అన్నది సందిగ్ధం నెలకొంది. మొత్తానికైతే ఉత్కంఠ వీడినట్టుగా తెలుస్తోంది.
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
- US: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా విలియం జె.పుల్టే నియామకం.. ట్రంప్ అభినందనలు
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
అమెరికాతో చర్చలకు సోమవారం అర్ధరాత్రి ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లుగా ఆక్సియోస్ తన నివేదిక పేర్కొంది. ప్రభుత్వంలోని పెద్దలు నిరాకరిస్తున్నప్పటికీ.. మోజ్తాబా మాత్రం చర్చలు జరిపేందుకు మొగ్గు చూపినట్లుగా తన కథనంలో పేర్కొంది. అంతర్గత చర్చల అనంతరం సోమవారం రాత్రి ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందని ఆక్సియోస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చల కోసం ఇరాన్ బృందం మంగళవారం ఇస్లామాబాద్ చేరుకోవచ్చని తెలుస్తోంది.
మరోవైపు అమెరికా నుంచి జేడీ వాన్స్ బృందం కూడా ఇస్లామాబాద్కు బయల్దేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, సలహాదారు జారెడ్ కుష్నర్ సహా సీనియర్ అధికారులతో కలిసి మంగళవారం ఇస్లామాబాద్కు చేరుకోనుంది. అయితే ఇరాన్ బృందం ఎప్పుడు బయల్దేరుతుందన్నదానిపై స్పష్టత రాలేదు. చర్చలకైతే వెళ్లాల్సిందిగా ఇరాన్ బృందానికి మోజ్తాబా సూచించినట్లుగా సమాచారం.
ప్రస్తుతం ఇస్లామాబాద్లో లాక్డౌన్ విధించారు. ప్రజలు రాజధానిలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున బలగాలు కూడా మోహరించాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. తొలి విడతలో దాదాపు 21 గంటల పాటు చర్చ జరిగింది. ఆ చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
-
4 Years of Vikram: లోకనాయకుడి ‘విక్రమ్’ కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
-
Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
-
Team India Series: భారీ సిరీస్కు సిద్ధంగా టీమిండియా.. అందరి దృష్టి ఈ లెజెండ్స్పైనే.. ఇదే లాస్ట్..
-
Dhanush Political Entry: విజయ్కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!