UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- పాకిస్తానీ ఉద్యోగుల్ని తొలగించిన ఎతిహాద్..
- 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని యూఏఈ ఆదేశం..
- పాక్-యూఏఈల మధ్య చెడిన సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), పాకిస్తాన్ మధ్య విభేదాలు ముదుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎతిహాద్ ఎయిర్వేస్ తన సంస్థలో పనిచేస్తున్న 18 మంది పాకిస్తానీ ఉద్యోగుల్ని తీసేసింది. ఇదే కాకుండా ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించడం సంచలనంగా మారింది. ఉద్యోగం కోల్పోయినవారిలో ఒకరు ఆ సంస్థలో 18 ఏళ్లుగా పనిచేస్తుండటం గమనార్హం. వీరిని ఉద్యోగం నుంచి తీసేసిన తర్వాత, ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద రిపోర్ట్ చేయమని చెప్పడం కొసమెరుపు. సాధారణంగా ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ, ఇమ్మిగ్రేషన్ అధికారుల ముందు రిపోర్టు ఎందుకు చేయమంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనిని బట్టి చూస్తే కావాలనే యూఏఈ పాకిస్తాన్ వ్యక్తుల్ని టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది.
Read Also: Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
Also Read
- H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
- Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
- Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
ఎలాంటి నోటీసులు లేకుండా రెండు రోజుల్లో పాకిస్తాన్ తిరిగి వెళ్లాలని ఆదేశించడంతో, ఇంత తక్కువ వ్యవధిలో వెళ్లిపోవడం కష్టంగా మారిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఆ దేశ ప్రజలు యూఏఈ నుంచి పంపించే డబ్బులు చాలా కీలకం. ఇదే కాకుండా చాలా మంది పాకిస్తానీలు యూఏఈలో ఉపాధి పొందుతారు. ఈ నేపథ్యంలో ఇలా ఉద్యోగాలను తీసేసయడం పాకిస్తాన్కు భారీ దెబ్బగా చెబుతున్నారు.
ఈ తొలగింపులపై ఇప్పటి వరకు ఎతిహాద్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇటీవల, ఇరాన్ పరిణామాలు, సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య ఒప్పందం యూఏఈకి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల యూఏఈ తనకు పాకిస్తాన్ నుంచి రావాల్సిన 3 బిలియన్ డాలర్లను వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఇరాన్ తమపై దాడులు చేస్తున్నా సౌదీ, పాకిస్తాన్లు కనీసం ఖండించలేదనే ఆగ్రహం యూఏఈలో ఉంది.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!