హైదరాబాద్ జర్నీలో ‘మైక్రోసాఫ్ట్’ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే అని, మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ (ఏఐ) బోధన ప్రవేశపెడతాం అని సీఎం చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీమ్కు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ నూతన…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. అనంతరం.. సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై చర్చిస్తున్నారు. తమ వ్యాపారాన్ని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది.
2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతీయ సంతతికి చెందిన సీఈవో సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి దాదాపు 7.91 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 665 కోట్లు) చేరింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల స్టాక్ అవార్డులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం.. ఆయన $39 మిలియన్ విలువైన స్టాక్ అవార్డును అందుకున్నారు. అది ఇప్పుడు $71 మిలియన్లకు పెరిగింది.
ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు ఏపీ మంత్రి నారా లోకేష్.. రెడ్మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేష్ టీమ్.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అయ్యాంది.. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి చేరుకున్నారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన బిల్ గేట్స్ తన కల గురించి చెప్పారు. సీఎన్బీసీ (CNBC) మేక్ ఇట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. బిల్ గేట్స్ తన కంపెనీ మైక్రోసాఫ్ట్ విజయ రహస్యం ఏమిటో చెప్పారు. తన కెరీర్కు సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా పంచుకున్నారు. తన కలలను నెరవేర్చుకోవడానికి కళాశాల విద్యను మధ్యలో ఆపేసిన వ్యాపారవేత్తలలో బిల్ గేట్స్ ఒకరు. అయితే.. ఈ జాబితాలో ఆపిల్ యొక్క స్టీవ్ జాబ్స్, మెటా యొక్క…
Tech Industry: 2023లో ప్రారంభమైన టెక్ పరిశ్రమలో తొలగింపుల దశ ముగిసే సంకేతాలు కనిపించడం లేదు. 2024 సంవత్సరంలో కూడా పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున తొలగింపులతో కొనసాగుతున్నాయి.
మీరు టెక్నాలజీ వార్తలు చదివి ఉంటే.. గత కొద్ది రోజులుగా క్రౌడ్స్ట్రైక్ పేరు వినే ఉంటారు. క్రౌడ్స్ట్రైక్ అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. గత కొద్ది రోజు ముందు మైక్రోసాఫ్ట్ అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సమస్య కారణంగా చాలా ఐటీ కంపెనీలు, ఎయిర్లైన్స్, బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇలా చాలా సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొ్నాయి. క్రౌడ్స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సమస్య కారణంగా నేడు ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం బ్యాంకులు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, వార్తా ఛానెల్లు, స్టాక్ మార్కెట్లు మరియు సూపర్ మార్కెట్లను ప్రభావితం చేసింది.
మైక్రోసాఫ్ట్ ఔటేజ్ వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రౌడ్స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.