Tech Industry: టెక్ పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు ఊస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Industry: 2023లో ప్రారంభమైన టెక్ పరిశ్రమలో తొలగింపుల దశ ముగిసే సంకేతాలు కనిపించడం లేదు. 2024 సంవత్సరంలో కూడా పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున తొలగింపులతో కొనసాగుతున్నాయి. ఇప్పుడు చాలా కంపెనీలు సైలెంట్ లేఆఫ్ ద్వారా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ ఏడాది జులై చివరి నాటికి దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూలైలోనే 34 టెక్ కంపెనీలు దాదాపు 8000 మందిని తొలగించాయి. ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను ఇంటికి పంపే ప్రక్రియను కొనసాగించాయి.
2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 384 కంపెనీల నుండి 124,517 మంది ఉద్యోగులు తమ జాబులు పోగొట్టుకున్నారు. ఇంటెల్ ఇటీవల 15 వేల మందికి పైగా ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. 10 బిలియన్ డాలర్లను ఆదా చేసే ప్రణాళికలో భాగంగా కంపెనీ తన ఉద్యోగులను 15 శాతం తగ్గించుకోనుంది. కంపెనీ ఆదాయంలో భారీ క్షీణత నెలకొంది. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే డివిడెండ్ ను కూడా తొలగించాయి. మరోవైపు, మైక్రోసాఫ్ట్ కూడా గత రెండు నెలల్లో సుమారు 1000 మందిని తొలగించింది. అయితే ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించడం లేదు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Read Also:Warangal Farmers News: రుణాల రెన్యువల్ కోసం రైతుల ఇక్కట్లు.. బ్యాంక్ ల ముందు క్యూ..
ఇది కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ యుకెజి సుమారు 2200 మంది ఉద్యోగులను తొలగించింది. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ Intuit కూడా సిబ్బందిని 10 శాతం తగ్గించి. 1800 మందిని ఇంటికి పంపింది. బ్రిటీష్ కంపెనీ డైసన్ కూడా పెరుగుతున్న పోటీ, పునర్నిర్మాణాన్ని పేర్కొంటూ 1000 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు, అమెరికాలో నిషేధం తర్వాత రష్యా సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పెర్స్కీ తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించుకుంది.
వివిధ కారణాల వల్ల భారతదేశంలోని అనేక కంపెనీలలో తొలగింపులు జరిగాయి. వీటిలో బెంగళూరు స్టార్టప్ రేషామండి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ట్విట్టర్ ప్రత్యర్థి మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ Koo కూడా భారతదేశంలో తన కార్యకలాపాలను క్లోజ్ చేసింది. అనాకాడెమీ 250 మంది ఉద్యోగులను తొలగించింది. వేకూల్ 200 మంది ఉద్యోగులను, PocketFM 200 మంది ఉద్యోగులను తీసివేసింది, Bungie 220 మంది ఉద్యోగులను తీసివేసింది. హంబుల్ గేమ్స్ తన ఉద్యోగులందరినీ తొలగించింది.
Read Also:Nithish kumar: బిహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు.. కోల్కతాలో నిందితుడి అరెస్ట్..!
తాజావార్తలు
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?