Tech Industry: టెక్ పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు ఊస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Industry: 2023లో ప్రారంభమైన టెక్ పరిశ్రమలో తొలగింపుల దశ ముగిసే సంకేతాలు కనిపించడం లేదు. 2024 సంవత్సరంలో కూడా పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున తొలగింపులతో కొనసాగుతున్నాయి. ఇప్పుడు చాలా కంపెనీలు సైలెంట్ లేఆఫ్ ద్వారా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ ఏడాది జులై చివరి నాటికి దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూలైలోనే 34 టెక్ కంపెనీలు దాదాపు 8000 మందిని తొలగించాయి. ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను ఇంటికి పంపే ప్రక్రియను కొనసాగించాయి.
2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 384 కంపెనీల నుండి 124,517 మంది ఉద్యోగులు తమ జాబులు పోగొట్టుకున్నారు. ఇంటెల్ ఇటీవల 15 వేల మందికి పైగా ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. 10 బిలియన్ డాలర్లను ఆదా చేసే ప్రణాళికలో భాగంగా కంపెనీ తన ఉద్యోగులను 15 శాతం తగ్గించుకోనుంది. కంపెనీ ఆదాయంలో భారీ క్షీణత నెలకొంది. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే డివిడెండ్ ను కూడా తొలగించాయి. మరోవైపు, మైక్రోసాఫ్ట్ కూడా గత రెండు నెలల్లో సుమారు 1000 మందిని తొలగించింది. అయితే ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించడం లేదు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Read Also:Warangal Farmers News: రుణాల రెన్యువల్ కోసం రైతుల ఇక్కట్లు.. బ్యాంక్ ల ముందు క్యూ..
ఇది కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ యుకెజి సుమారు 2200 మంది ఉద్యోగులను తొలగించింది. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ Intuit కూడా సిబ్బందిని 10 శాతం తగ్గించి. 1800 మందిని ఇంటికి పంపింది. బ్రిటీష్ కంపెనీ డైసన్ కూడా పెరుగుతున్న పోటీ, పునర్నిర్మాణాన్ని పేర్కొంటూ 1000 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు, అమెరికాలో నిషేధం తర్వాత రష్యా సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పెర్స్కీ తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించుకుంది.
వివిధ కారణాల వల్ల భారతదేశంలోని అనేక కంపెనీలలో తొలగింపులు జరిగాయి. వీటిలో బెంగళూరు స్టార్టప్ రేషామండి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ట్విట్టర్ ప్రత్యర్థి మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ Koo కూడా భారతదేశంలో తన కార్యకలాపాలను క్లోజ్ చేసింది. అనాకాడెమీ 250 మంది ఉద్యోగులను తొలగించింది. వేకూల్ 200 మంది ఉద్యోగులను, PocketFM 200 మంది ఉద్యోగులను తీసివేసింది, Bungie 220 మంది ఉద్యోగులను తీసివేసింది. హంబుల్ గేమ్స్ తన ఉద్యోగులందరినీ తొలగించింది.
Read Also:Nithish kumar: బిహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు.. కోల్కతాలో నిందితుడి అరెస్ట్..!
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!