Tech Industry: టెక్ పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు ఊస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Industry: 2023లో ప్రారంభమైన టెక్ పరిశ్రమలో తొలగింపుల దశ ముగిసే సంకేతాలు కనిపించడం లేదు. 2024 సంవత్సరంలో కూడా పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున తొలగింపులతో కొనసాగుతున్నాయి. ఇప్పుడు చాలా కంపెనీలు సైలెంట్ లేఆఫ్ ద్వారా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. ఈ ఏడాది జులై చివరి నాటికి దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూలైలోనే 34 టెక్ కంపెనీలు దాదాపు 8000 మందిని తొలగించాయి. ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను ఇంటికి పంపే ప్రక్రియను కొనసాగించాయి.
2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 384 కంపెనీల నుండి 124,517 మంది ఉద్యోగులు తమ జాబులు పోగొట్టుకున్నారు. ఇంటెల్ ఇటీవల 15 వేల మందికి పైగా ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. 10 బిలియన్ డాలర్లను ఆదా చేసే ప్రణాళికలో భాగంగా కంపెనీ తన ఉద్యోగులను 15 శాతం తగ్గించుకోనుంది. కంపెనీ ఆదాయంలో భారీ క్షీణత నెలకొంది. కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే డివిడెండ్ ను కూడా తొలగించాయి. మరోవైపు, మైక్రోసాఫ్ట్ కూడా గత రెండు నెలల్లో సుమారు 1000 మందిని తొలగించింది. అయితే ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించడం లేదు.
Also Read
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
Read Also:Warangal Farmers News: రుణాల రెన్యువల్ కోసం రైతుల ఇక్కట్లు.. బ్యాంక్ ల ముందు క్యూ..
ఇది కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీ యుకెజి సుమారు 2200 మంది ఉద్యోగులను తొలగించింది. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ Intuit కూడా సిబ్బందిని 10 శాతం తగ్గించి. 1800 మందిని ఇంటికి పంపింది. బ్రిటీష్ కంపెనీ డైసన్ కూడా పెరుగుతున్న పోటీ, పునర్నిర్మాణాన్ని పేర్కొంటూ 1000 మంది ఉద్యోగుల తొలగింపును ప్రకటించింది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు, అమెరికాలో నిషేధం తర్వాత రష్యా సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పెర్స్కీ తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించుకుంది.
వివిధ కారణాల వల్ల భారతదేశంలోని అనేక కంపెనీలలో తొలగింపులు జరిగాయి. వీటిలో బెంగళూరు స్టార్టప్ రేషామండి 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ట్విట్టర్ ప్రత్యర్థి మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ Koo కూడా భారతదేశంలో తన కార్యకలాపాలను క్లోజ్ చేసింది. అనాకాడెమీ 250 మంది ఉద్యోగులను తొలగించింది. వేకూల్ 200 మంది ఉద్యోగులను, PocketFM 200 మంది ఉద్యోగులను తీసివేసింది, Bungie 220 మంది ఉద్యోగులను తీసివేసింది. హంబుల్ గేమ్స్ తన ఉద్యోగులందరినీ తొలగించింది.
Read Also:Nithish kumar: బిహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు.. కోల్కతాలో నిందితుడి అరెస్ట్..!
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!