CrowdStrike CEO: మైక్రోసాఫ్ట్ సర్వర్ సమస్యపై క్రౌడ్స్ట్రైక్ సీఈవో కీలక వ్యాఖ్యలు..
- క్రౌడ్స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందన్న మైక్రోసాఫ్ట్
- స్పందించిన క్రౌడ్స్ట్రైక్ కంపెనీ సీఈఓ జార్జ్ కర్ట్జ్
- ఈ సమస్య ఎందుకు తలెత్తిందన్న అంశంపై వివరణ
- లోపభూయిష్ట కంటెంట్ అప్డేట్ వల్లే సమస్య ఉత్పన్నమైందన్న జార్జ్ కర్ట్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోసాఫ్ట్ ఔటేజ్ వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రౌడ్స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇంతలో.. క్రౌడ్స్ట్రైక్ కంపెనీ సీఈఓ జార్జ్ కర్ట్జ్ ఈ సమస్య ఎందుకు తలెత్తింది.. దాన్ని పరిష్కరించడానికి ఏమి చేశారో వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. లోపభూయిష్ట కంటెంట్ అప్డేట్ వల్లే సమస్య మొదలైందని ఆయన అన్నారు. జార్జ్ కర్ట్జ్ తన ఎక్స్ ఖాతాలో “విండోస్ (Windows) హోస్ట్ల కోసం ఒకే కంటెంట్ అప్డేట్లో కనుగొనబడిన లోపం వల్ల ప్రభావితమైన కస్టమర్లతో క్రౌడ్స్ట్రైక్ పని చేస్తోంది. Mac మరియు Linux హోస్ట్లు ప్రభావితం కావు. ఇది సైబర్ దాడి కాదు. భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదు. సమస్య గుర్తించి పరిష్కారించాం.” అని రాసుకొచ్చారు.
READ MORE: ISRO somanath: ఐఐటీ మద్రాస్ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్న ఇస్రో చైర్మన్
Also Read
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
కాగా.. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వర్లు పనిచేయకపోవడానికి క్రౌడ్స్ట్రైక్ బాధ్యత వహిస్తుంది. క్రౌడ్స్ట్రైక్ ఒక అమెరికన్ సెక్యూరిటీ సంస్థ. ఈ సంస్థ మైక్రోసాఫ్ట్తో సన్నిహితంగా పనిచేస్తుంది. ఐటీ కంపెనీలను హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉంచడంలో ఈ సంస్థ సహాయపడుతుంది. హ్యాకర్లు, సైబర్ దాడులు, డేటా లీక్ల నుంచి కంపెనీలను రక్షించడం దీని ప్రధాన విధి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బ్యాంకులు, విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ సంస్థలు ఈ కంపెనీకి ప్రధాన కస్టమర్లు కావడానికి ఇదే కారణం. సైబర్ ప్రపంచంలో ఇటీవలి కాలంలో చాలా మార్పులు వచ్చాయి. హ్యాకర్ల దాడుల కారణంగా.. క్రౌడ్స్ట్రైక్ వంటి సంస్థలపై కంపెనీల ఆధారపడటం పెరిగింది.
క్రౌడ్ స్ట్రైక్ యొక్క ప్రధాన ఉత్పత్తులలో ఒకటైన ఫాల్కన్ ఈ ఉత్పత్తిలో లోపం తలెత్తింది. కంపెనీ ఫాల్కన్ ఉత్పత్తి నెట్వర్క్లో హానికరమైన లేదా వైరస్-కలిగిన ఫైల్లను గుర్తిస్తుంది. ఇది హానికరమైన ఫైల్లను గుర్తించడానికి మరియు వైరస్లను ఆపడానికి ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తుంది.
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!