CM Revanth: సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. మరిన్ని పెట్టుబడుల కోసం చర్చ
- సత్య నాదెళ్లతో సీఎం రేవంత్రెడ్డి భేటీ
- హాజరైన మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, సీఎస్
- తెలంగాణలో 6 డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న మైక్రోసాఫ్ట్
- మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సత్య నాదెళ్లను కోరనున్న సీఎం
- స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్పై చర్చ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. అనంతరం.. సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై చర్చిస్తున్నారు. తమ వ్యాపారాన్ని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో 25 ఎకరాల భూమిని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ చెల్లించిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్లో దీనికి సంబంధించిన లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్లో డేటా సెంటర్ వ్యాపారాన్ని విస్తరించాలని చాన్నాళ్ల కిందట మైక్రో సాప్ట్ ప్లాన్ చేసింది.
Pawan Kalyan-Nagababu: నాగబాబుకు మంత్రి పదవి.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!
Also Read
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
ప్రస్తుతం మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. కాగా.. ఈ సమావేశాన్ని గేమ్ ఛేంజర్గా భావిస్తోంది ఐటీ ఇండస్ట్రీ. తెలంగాణంలో మొత్తం 6 డేటా కేంద్రాలను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. ఈ డేటా సెంటర్లకు 32 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లాలో మూడు చోట్ల మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో డేటా కేంద్రం 100 మెగావాట్ల ఐటీ లోడ్ కలిగి ఉంటుంది.
KTR: ఈడీ ఈ కేసులో అత్యుత్సాహం చూపిస్తుంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
అలాగే.. మేకగూడలో 22 ఎకరాలు, షాద్నగర్లో 41 ఎకరాలు, చందన్వల్లిలో 52 ఎకరాలు కొనుగోలు చేసింది మైక్రోసాఫ్ట్. అంతేకాకుండా.. డేటా సెంటర్ల పనులు 70 శాతం పూర్తి కూడా అయ్యాయి. పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరనుంది. ఈ క్రమంలో.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సత్య నాదెళ్లను కోరనున్నారు ముఖ్యమంత్రి.
తాజావార్తలు
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?