ఒకప్పుడు తన చేతుల్లో రైఫిల్ పట్టుకున్న తర్వాత, కరణ్ హేమ్లా ఇప్పుడు పెన్ను పట్టుకుని మంచి భవిష్యత్తు కోసం ఛత్తీస్గఢ్లో పదోతరగతి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. 2005లో బస్తర్ డివిజన్లో నక్సల్స్ వ్యతిరేక ఉద్యమం 'సల్వా జుడుం' ప్రారంభం కావడంతో హింస చెలరేగడంతో కరణ్ హేమ్లా చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం పొరుగున ఉన్న మహారాష్ట్రకు చెందిన సీ-60 కమాండోలతో సహా భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఇద్దరు మావోయిస్టులలో డివిజనల్ కమిటీ-ర్యాంక్ మావోయిస్ట్ తలపై కనీసం రూ. 21 లక్షల రివార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
త్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా రేవాలిలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ మహిళా సర్పంచ్ భర్తను మావోయిస్టులు. హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలో పడేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు.
మధ్యప్రదేశ్లో మావోయిస్టులు-భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు సహా ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బాలాఘాట్ జిల్లాలోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ కాల్పులు జరిగాయి. ఈ ముగ్గురి మావోలపై రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాఘాట్ జిల్లాలోని బహేలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఈ…
మావోయిస్టుల కోసం నిరంతరం వేట కొనసాగుతూనే ఉంది.. కూంబింగ్ నిర్వహిస్తూ అడవులను జల్లెడ పడుతూ.. మావోయిస్టులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.. కొన్ని సందర్భాల్లో వారి నుంచి ప్రతిఘటన కూడా తప్పడంలేదు.. కాల్పులు, ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్లు.. ఇలా నిత్యం ఏదో ఒక ఘటన వెలుగు చూస్తూనే ఉంది.. అయితే, మావోయిస్టులను పట్టిస్తే భారీగా నజరానాలు ఇస్తామని ప్రకటించింది ఎన్ఐఏ. Read Also: Viral: మహిళను తొక్కి చంపిన ఏనుగు.. అంత్యక్రియలు కూడా అడ్డుకొని..! ఎన్ఐఏ.. కొందరు…
ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపునకు మావోయిస్టుల నుంచి జవాబు వచ్చింది. మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని అయితే అందుకు తమకు కూడా కొన్ని ముందస్తు షరతులున్నాయని సీపీఐ మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ప్రకటనలో పేర్కొన్నారు. వికల్ప్ ప్రకటన పూర్తి పాఠం….…
ఈమధ్యకాలంలో మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. అక్కడక్కడా వివిధ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో గ్రేహౌండ్స్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. కూంబింగ్ లు పెంచారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నలుగురు మావోయిస్ట్ లు అరెస్టయ్యారు. గడ్చిరోలి జిల్లాలో టాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయింగ్ పోలీసులు నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ధోడ్ రాజ్ పరిడాని నెలగుండ అడవిలో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా పోలీసులు ఈ అరెస్ట్ లు చేశారు. సీపీఐ మావోయిస్ట్ గ్రూప్ కి చెందిన నక్సల్స్…