Maoists Letter: ఆయుధాలు వదిలి రావాలన్న పిలుపు… మావోయిస్టుల జవాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపునకు మావోయిస్టుల నుంచి జవాబు వచ్చింది. మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని అయితే అందుకు తమకు కూడా కొన్ని ముందస్తు షరతులున్నాయని సీపీఐ మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ప్రకటనలో పేర్కొన్నారు.
వికల్ప్ ప్రకటన పూర్తి పాఠం….
Also Read
- PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
మా చర్చల నిబంధనలపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలి! ప్రజల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడం ఆపండి!
మావోయిస్టులు భారత రాజ్యాంగాన్ని అంగీకరించి ఆయుధాలు వదులుకుంటే వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రకటించడం అసంబద్ధం, కపటత్వానికి నిదర్శనం. ఒకవైపు ఏరియల్ బాంబ్ దాడులు చేస్తూ మరోవైపు చర్చల ప్రతిపాదన చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే. ఇది మావోయిస్టులపై దుష్ప్రచారం చేయడమే తప్ప మరొకటి కాదు. ఈ ప్రకటన వెనుక పెద్ద దాడికి కుట్ర జరుగుతోంది.
తూటాలకు తూటాలతో సమాధానం చెప్పే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఇటీవలి వైమానిక దాడులకు ఎందుకు సమ్మతించారో చెప్పాలి? బఘేల్ జీ తన సొంత ప్రజలపైనే జరుగుతున్న యుద్ధంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపాడని ఇటీవల జరిగిన వైమానిక బాంబు దాడి రుజువు కాదా?
బస్తర్ ప్రజలపై ఏరియల్ బాంబు దాడులు జరగలేదు అంటూ బస్తర్ IG పచ్చి అబద్ధం చెబుతున్నారు. మీరు కూడా కూడా ఏరియల్ బాంబు దాడిని తిరస్కరిస్తే, ఏ దేశ సైన్యం వచ్చి బస్తర్ అడవుల్లో ఏరియల్ బాంబు దాడి చేసిందో దర్యాప్తు చేయండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆరు సాయుధ సంస్థలతో తమ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్వయంగా ప్రధాని ప్రకటించినప్పుడు, మాతో చర్చల కోసం ఆయుధాలు వదులుకోమని ముఖ్యమంత్రి బఘేల్ జీ ఎందుకు అడుగుతున్నారు? ఇందులో ఎలాంటి లాజిక్ లేదు. పెట్రోలింగ్ ఆపరేషన్లు, ఎన్కౌంటర్లు, తప్పుడు ఎన్కౌంటర్లు, ఊచకోతలు, అక్రమ అరెస్టులు, ప్రజా ప్రాణాలకు, ఆస్తులకు నష్టం చేస్తున్నారు. మా పార్టీ, పిఎల్జిఎ పేరుతో ప్రతిరోజూ లక్షలాది మంది పోలీసులను, పారామిలటరీ,సైనిక బలగాలను దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో మోహరిస్తున్నారు. విప్లవ పీపుల్స్ కమిటీల నిర్మూలన కోసం ప్రచారాలను నిర్వహిస్తూ, నిరంతరం సాయుధ దళాల కొత్త శిబిరాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు మమ్ములను ఆయుధాలను వదులుకోమని అడగడం హాస్యాస్పదమైనది, అర్థరహితం మరియు అసంబద్ధం.
భారత రాజ్యాంగానికి వ్యతిరేకిస్తున్నది ప్రభుత్వాలే. ప్రభుత్వాలు మాత్రమే ప్రజల రాజ్యాంగ హక్కులను ఘోరంగా ఉల్లంఘిస్తున్నాయి. ఐదవ షెడ్యూల్, పెసా చట్టం ప్రకారం గ్రామసభల హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గ్రామసభల అనుమతి లేకుండా పోలీసులు, పారామిలటరీ బలగాలు, సైనిక బలగాల శిబిరాలు విచ్చలవిడిగా ఏర్పాటు చేసి రోడ్లు, వంతెనలు, కల్వర్టులు నిర్మిస్తున్నారు. నిరసనలు చేస్తున్నప్పుడు, మారణకాండలు, తప్పుడు ఎన్కౌంటర్లలో గిరిజనులు చంపుతున్నారు. దేశంలోని సహజ సంపద, వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి బస్తర్ గిరిజనులపై వైమానిక దాడులు చేస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు పగలూ రాత్రీ వారి తలలపై తిరుగుతూనే ఉన్నాయి. వారి జీవనం కష్టంగా మారింది.
నయా రాయ్పూర్ నిర్వాసిత రైతుల ఉద్యమం, పోలీసు శిబిరాలు, మారణకాండలకు వ్యతిరేకంగా, వారి ఇతర న్యాయమైన డిమాండ్ల కోసం, గత సంవత్సరం నుండి సిలంగర్ స్థానిక ప్రజల ఉద్యమంతో సహా, వెచ్చఘాట్, వేచపాల్, పుస్నార్, గోంపాడ్, పుస్గుప్ప వంటి ప్రదేశాలలో ప్రజలు శాంతియుత, రాజ్యాంగ బద్దమైన ధర్నాలు చేస్తూ ఉంటే వారిపై సాయుధ బలగాల క్రూరమైన దాడులు ఏమి సూచిస్తున్నాయి?
నిజం చెప్పాలంటే రాజ్యాంగాన్ని ఆమోదించమని అడిగే నైతిక హక్కు కూడా ప్రభుత్వాలకు లేదు. ముందుగా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పాటించి నిజాయితీగా అమలు చేయాలి. కేవలం కాగితాలకే పరిమితమైన సార్వభౌమాధికారం, లౌకికవాదం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం వంటి రాజ్యాంగ పీఠికలోని ప్రాథమిక భావాలను ధ్వంసం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంది.
మావోయిస్టు ఉద్యమాన్ని నాశనం చేయడం కోసం, బాఘేల్ జీ విశ్వాసం, అభివృద్ధి మరియు భద్రత సూత్రాల గురించి మాట్లాడారు. ఇక్కడ దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థల విశ్వాసాన్ని గెలుచుకోవడం, వారి అభివృద్ధికి అవసరమైన పథకాలను అమలు చేయడం వారి ఆర్థిక మరియు ఇతర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఇది ఒక ఫార్ములా అని బాఘేల్ జీ మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలి.
చివరగా, ముఖ్యమంత్రి చర్చల ప్రతిపాదనకు మా ప్రతిస్పందన ఏమిటంటే, మేము చర్చలకు ఎల్లవేళలా సిద్దంగానే ఉన్నాము. అందుకోసం అనుకూలమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మీది. ముందుగా మా పార్టీపై , PLGA, ప్రజా సంఘాలపై విధించిన ఆంక్షలను తొలగించి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించండి. మాకు బహిరంగ కార్యకలాపాలు చేసుకునే అవకాశం ఇవ్వండి, వైమానిక బాంబు దాడులను ఆపండి, సంఘర్షణ ప్రాంతాల నుండి సాయుధ దళాల శిబిరాలను ఉపసంహరించుకోండి, బలగాలను వెనక్కి పంపండి, జైలులో ఉన్న మా నాయకులను చర్చల కోసం విడుదల చేయండి. ఈ సమస్యలపై మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి.
వికల్ప్
అధికార ప్రతినిధి
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)
తాజావార్తలు
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!