Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Chhattisgarh Cm Bhupesh Baghel On Maoists

Maoists Letter: ఆయుధాలు వదిలి రావాలన్న పిలుపు… మావోయిస్టుల జవాబు

Published Date :May 10, 2022 , 7:21 am
By NTV WebDesk
Maoists Letter: ఆయుధాలు వదిలి రావాలన్న పిలుపు… మావోయిస్టుల జవాబు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపునకు మావోయిస్టుల నుంచి జవాబు వచ్చింది. మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని అయితే అందుకు తమకు కూడా కొన్ని ముందస్తు షరతులున్నాయని సీపీఐ మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ప్రకటనలో పేర్కొన్నారు.

వికల్ప్ ప్రకటన పూర్తి పాఠం….

మా చర్చల నిబంధనలపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలి! ప్రజల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడం ఆపండి!

మావోయిస్టులు భారత రాజ్యాంగాన్ని అంగీకరించి ఆయుధాలు వదులుకుంటే వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రకటించడం అసంబద్ధం, కపటత్వానికి నిదర్శనం. ఒకవైపు ఏరియల్ బాంబ్ దాడులు చేస్తూ మరోవైపు చర్చల ప్రతిపాదన చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే. ఇది మావోయిస్టులపై దుష్ప్రచారం చేయడమే తప్ప మరొకటి కాదు. ఈ ప్రకటన వెనుక పెద్ద దాడికి కుట్ర జరుగుతోంది.

తూటాలకు తూటాలతో సమాధానం చెప్పే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఇటీవలి వైమానిక దాడులకు ఎందుకు సమ్మతించారో చెప్పాలి? బఘేల్ జీ తన సొంత ప్రజలపైనే జరుగుతున్న యుద్ధంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపాడని ఇటీవల జరిగిన వైమానిక బాంబు దాడి రుజువు కాదా?

బస్తర్ ప్రజలపై ఏరియల్ బాంబు దాడులు జరగలేదు అంటూ బస్తర్ IG పచ్చి అబద్ధం చెబుతున్నారు. మీరు కూడా కూడా ఏరియల్ బాంబు దాడిని తిరస్కరిస్తే, ఏ దేశ సైన్యం వచ్చి బస్తర్ అడవుల్లో ఏరియల్ బాంబు దాడి చేసిందో దర్యాప్తు చేయండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆరు సాయుధ సంస్థలతో తమ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్వయంగా ప్రధాని ప్రకటించినప్పుడు, మాతో చర్చల కోసం ఆయుధాలు వదులుకోమని ముఖ్యమంత్రి బఘేల్ జీ ఎందుకు అడుగుతున్నారు? ఇందులో ఎలాంటి లాజిక్ లేదు. పెట్రోలింగ్ ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్లు, తప్పుడు ఎన్‌కౌంటర్లు, ఊచకోతలు, అక్రమ అరెస్టులు, ప్రజా ప్రాణాలకు, ఆస్తులకు నష్టం చేస్తున్నారు. మా పార్టీ, పిఎల్‌జిఎ పేరుతో ప్రతిరోజూ లక్షలాది మంది పోలీసులను, పారామిలటరీ,సైనిక బలగాలను దేశవ్యాప్తంగా అనేక‌ ప్రాంతాలలో మోహరిస్తున్నారు. విప్లవ పీపుల్స్ కమిటీల నిర్మూలన కోసం ప్రచారాలను నిర్వహిస్తూ, నిరంతరం సాయుధ దళాల కొత్త శిబిరాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు మమ్ములను ఆయుధాలను వదులుకోమని అడగడం హాస్యాస్పదమైనది, అర్థరహితం మరియు అసంబద్ధం.

భారత రాజ్యాంగానికి వ్యతిరేకిస్తున్నది ప్రభుత్వాలే. ప్రభుత్వాలు మాత్రమే ప్రజల రాజ్యాంగ హక్కులను ఘోరంగా ఉల్లంఘిస్తున్నాయి. ఐదవ షెడ్యూల్, పెసా చట్టం ప్రకారం గ్రామసభల హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గ్రామసభల అనుమతి లేకుండా పోలీసులు, పారామిలటరీ బలగాలు, సైనిక బలగాల శిబిరాలు విచ్చలవిడిగా ఏర్పాటు చేసి రోడ్లు, వంతెనలు, కల్వర్టులు నిర్మిస్తున్నారు. నిరసనలు చేస్తున్నప్పుడు, మారణకాండలు, తప్పుడు ఎన్‌కౌంటర్లలో గిరిజనులు చంపుతున్నారు. దేశంలోని సహజ సంపద, వనరులను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి బస్తర్ గిరిజనులపై వైమానిక దాడులు చేస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు పగలూ రాత్రీ వారి తలలపై తిరుగుతూనే ఉన్నాయి. వారి జీవనం కష్టంగా మారింది.

నయా రాయ్‌పూర్ నిర్వాసిత రైతుల ఉద్యమం, పోలీసు శిబిరాలు, మారణకాండలకు వ్యతిరేకంగా, వారి ఇతర న్యాయమైన డిమాండ్‌ల కోసం, గత సంవత్సరం నుండి సిలంగర్ స్థానిక ప్రజల ఉద్యమంతో సహా, వెచ్చఘాట్, వేచపాల్, పుస్నార్, గోంపాడ్, పుస్‌గుప్ప వంటి ప్రదేశాలలో ప్రజలు శాంతియుత, రాజ్యాంగ బద్దమైన ధర్నాలు చేస్తూ ఉంటే వారిపై సాయుధ బలగాల క్రూరమైన దాడులు ఏమి సూచిస్తున్నాయి?

నిజం చెప్పాలంటే రాజ్యాంగాన్ని ఆమోదించమని అడిగే నైతిక హక్కు కూడా ప్రభుత్వాలకు లేదు. ముందుగా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పాటించి నిజాయితీగా అమలు చేయాలి. కేవలం కాగితాలకే పరిమితమైన సార్వభౌమాధికారం, లౌకికవాదం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం వంటి రాజ్యాంగ పీఠిక‌లోని ప్రాథమిక భావాలను ధ్వంసం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంది.

మావోయిస్టు ఉద్యమాన్ని నాశనం చేయడం కోసం, బాఘేల్ జీ విశ్వాసం, అభివృద్ధి మరియు భద్రత సూత్రాల గురించి మాట్లాడారు. ఇక్కడ దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థల విశ్వాసాన్ని గెలుచుకోవడం, వారి అభివృద్ధికి అవసరమైన పథకాలను అమలు చేయడం వారి ఆర్థిక మరియు ఇతర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఇది ఒక ఫార్ములా అని బాఘేల్ జీ మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలి.

చివరగా, ముఖ్యమంత్రి చర్చల ప్రతిపాదనకు మా ప్రతిస్పందన ఏమిటంటే, మేము చర్చలకు ఎల్లవేళలా సిద్దంగానే ఉన్నాము. అందుకోసం అనుకూలమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మీది. ముందుగా మా పార్టీపై , PLGA, ప్రజా సంఘాలపై విధించిన ఆంక్షలను తొలగించి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించండి. మాకు బహిరంగ కార్యకలాపాలు చేసుకునే అవకాశం ఇవ్వండి, వైమానిక బాంబు దాడులను ఆపండి, సంఘర్షణ ప్రాంతాల నుండి సాయుధ దళాల శిబిరాలను ఉపసంహరించుకోండి, బలగాలను వెనక్కి పంపండి, జైలులో ఉన్న మా నాయకులను చర్చల కోసం విడుదల చేయండి. ఈ సమస్యలపై మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి.

వికల్ప్
అధికార ప్రతినిధి
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)

 

Sri Lanka Crisis: శ్రీలంకలో ప్రధాని, ఎంపీల ఇళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు…. పరిస్థితిని గమనిస్తున్న అమెరికా 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • attacks
  • cease fire
  • Chhattisgarh Cm Bhupesh Baghel on maoists
  • Maoists
  • Maoists ready for talks

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Fake Holi Links: హోలీ పేరుతో లింక్స్.. ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • Varanasi : స్పిరిట్, రామాయణ రిలీజ్ ప్లానింగ్‌పై రాజమౌళి అసంతృప్తి

  • Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..

  • CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..!

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions