ఏజెన్సీ ప్రాంతాల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకునేందకు మావోయిస్టులు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే గత సోమవారం సాయంత్రం ములుగు జిల్లాలోని కె.కొండాపురం మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా ఛతీస్గఢ్లోని కొత్తపల్లి సమీపంలో రమేశ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో రమేశ్ను మావోయిస్టులు…
ఛత్తీస్గడ్లో మరోసారి పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. దంతెవాడ జిల్లా గోండెరాస్ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మహిళా మావోయిస్టులు హిద్మే కొహ్రమె, పొజ్జె లుగా పోలీసులు గుర్తించారు. అయితే హిద్మే తలపై రూ.5లక్షలు, పొజ్జె తలపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏజేన్సీలో అనుమానం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.…
భద్రాచలం పట్టణంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లుతో స్థానికంగా కలకలం రేపుతున్నాయి.. ఎక్కువగా మావోయిస్టులు మాత్రమే పోస్టర్లను అంటించి వారి ఉద్దేశాలను తెలుపుతుంటారు. అయితే తాజాగా వెలసిన పోస్టర్లు మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. మావోయిస్టుల విధానాలను ప్రజలు ప్రశ్నిస్తున్నట్లుగా పట్టణంలో అక్కడక్కడ పోస్టర్లు అంటించారు. అంతేకాకుండా మావోయిస్టుల పార్టీకీ సూటి ప్రశ్నలు వేసినట్లు ఈ పోస్టర్లలో సారాంశం ఉంది. నక్సలైట్లు అంటే నరహంతకులు కాదా? అభివృద్ధిని అడ్డుకోవడం నక్సలిజమా? ప్రజా విప్లవం అంటే విధ్వంసమా? తుపాకీ…
కొన్ని సినిమాల్లో చూశాం.. అధికారిగా ఉన్న హీరోను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం.. అతడిని విడిపించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడం.. ఇక, నేరుగా భార్యే రంగంలోకి దిగి.. ఉగ్రవాదుల నుంచి తన భర్తను విడిపించుకోవడం.. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది.. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్తను విడిపించడానికి అధికారులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. తన కొడుకుతో అడవికి వెళ్లి.. తన భర్తను కాపాడుకుంది ఓ ఇల్లాలు.. ఈ ఘటనకు…
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారబట్టిలో గత శనివారం భీకర ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసింది. ఈ ఎన్ కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందగా, అందులో ఆరుగు మహిళలు ఉన్నారు. అయితే మరణించిన వారిలో కీలక నేతలు ఉండటం గమనార్హం. తాజాగా గడ్చిరోలి జిల్లా కుడుగుల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ పార్టీలకు మరో మావో మృత దేహం లభ్యమైంది. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం జహల్ నక్సలైట్ నాయకుడు సుఖ్లాల్…
కూంబింగ్ నిర్వహించే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబి ట్రాప్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట అటవీ ప్రాంతంలో బూబి ట్రాప్ లు మావోయిస్టులు అమర్చారు. కూబింగ్ చేసే పోలీస్ బలగాలు లక్ష్యంగా ఏడు చోట్ల పదునైన వెదురు కర్రలతో బూబి ట్రాప్లను మావోలు ఏర్పాటు చేశారు. కానీ… చింతూరు డివిజన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా బూబి ట్రాప్ లను గుర్తించి ధ్వంసం చేశారు. కాలిబాటల్లో గోతులు తవ్వి పదునైన వెదురు కర్రలతో…
ఛత్తీస్గఢ్ లో కిడ్నాప్ చేసిన గిరిజనులను వదిలి పెట్టారు మావోయిస్టులు. ఛత్తీస్ఘడ్లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. సుక్మా జిల్లాలోని బటేరులో ఐదుగురిని కిడ్నాప్ చేసారు మావోయిస్టులు. అయితే నిన్న అర్ధరాత్రి ఆ ఐదుగురు గిరిజనులను వదిలిపెట్టారు మావోయిస్టులు. ఇద్దరిని చితకబాది హెచ్చరించి వదిలేసిన మావోయిస్టులు… ఈ నెల 5న ఐదుగురు గిరిజనులను అడవిలోకి ఎత్తుకెళ్లరు మావోయిస్టులు. కొంటా బ్లాక్లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
ఛత్తీస్ఘడ్లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. కొంటా బ్లాక్లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం నలుగురిని కిడ్నాప్ చేయగా, శనివారం మరో గ్రామస్థుడిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కిడ్నాప్ చేసిన గ్రామస్థుల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. గ్రామస్తులందరినీ సురక్షితంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ నక్సలైట్లకు విజ్ఞప్తి చేసింది.
మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే చాలామంది మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుంటే కొందరూ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. మావోల కీలక నాయకుడైనా హిద్మా కోసం పోలీసుల గాలింపులు ఆగడం లేదు. మావోలకు పట్టున్న ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోనూ వారు ఉనికిని కోల్పోతున్నారు. తాజాగా ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 14 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్ ఎదుట సరెండర్ అయ్యారు. మావోలు లొంగిపోయిన అనంతరం జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్…
మావోయిస్టులు వరుసగా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. కరోనా ప్రభావం తరువాత మావోయిస్టుల లొంగుబాటులు ఎక్కువయ్యాయి. కానీ ఈ విషయం మావోయిస్టు పార్టీలకు తీవ్ర నష్టాన్ని కలిగించేదే. అయితే ఇటీవల కరోనా బారినపడి మావోయిస్టుల్లో అగ్రనేతలు సైతం మరణించారు. దీంతో మావోయిస్టులు అడవిని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తాజా మరో 14 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఎస్పీ ముందు లొంగిపోయారు. వీరిలో రూ.లక్ష రివార్డు ఉన్న సన్నా మార్కం కూడా ఉండడం విశేషం. భద్రత సిబ్బందిపై…