Abhishek Banerjee: మమతా బెనర్జీ రాబోయే తరానికి రాజకీయాలను అప్పగించాలనుకుంటున్నారా? ఈ ప్రశ్న గత కొన్ని రోజులుగా కోల్కతా వీధుల నుండి ఢిల్లీ వరకు ప్రజల వరకు మదిలో మెదులుతోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ 37వ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డైమండ్ హార్బర్ ఎంపీనే తదుపరి ముఖ్యమంత్రి కాగలరని రాజ్యసభకు చెందిన టీఎంసీ మాజీ ఎంపీ కునాల్…
కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక వైద్యులకు భద్రత కల్పించాలంటూ గత కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్ష చేస్తు్న్నారు. వీరికి మద్దతుగా సీనియర్ డాక్టర్లు కూడా రాజీనామాలు కూడా సమర్పించారు.
Kolkata Doctor Case: కోల్కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య సంఘటన తర్వాత యావత్ దేశంలో నిరసన, ఆందోలనలు నెలకొన్నాయి. ఇప్పటికీ బెంగాల్ వ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే, సోమవారం డాక్టర్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం విజయవంతమైంది. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లకు సీఎం తలొగ్గారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల సమావేశం ముగిసింది. కాళీఘాట్ నివాసంలో ఆమెతో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో 30 మంది వైద్యులు సాయంత్రం 6:20 గంటలకు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు.
కోల్కతాలో నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లను బెంగాల్ ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటికే నాలుగు సార్లు మమత సర్కార్ చర్చలకు పిలిచింది. కానీ డాక్టర్లు మాత్రం చర్చలు నిరాకరించారు.
Rape Attempt: అత్యాచారం ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారు. నిందితుడు నారాయణ్ తన నివాసంలో బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అతను తన బంకురా నివాసంలో మూడు రోజుల పాటు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబీకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా టీఎంసీ ఆయనను ట్రేడ్ యూనియన్ నుంచి సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆర్జికర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై అత్యాచారం,…
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ కీలక చర్య తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాజీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, కోల్కతా పోలీస్ ఎస్హెచ్ఓ అభిజీత్ మండల్లను అరెస్టు చేసింది.
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేల సీఎం మమతా బెనర్జీతో చర్చలకు అంగీకరించారు.
Mamata Banerjee: కోల్కతా వైద్యురాలి ఘటన పశ్చిమ బెంగాల్ సర్కార్, సీఎం మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్లో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశంలో నిరసనలకు కారణమైంది. బెంగాల్లో ఇప్పటికీ బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశానికి డాక్టర్లు ఎవరూ హాజరుకాలేదు.