కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసి లేఖ తాజాగా వైరల్ అవుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ మమత లేఖ రాసింది. కోల్కతా ఘటన తర్వాత ఈ లేఖ వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన యావత్తు దేశాన్ని కుదిపేస్తున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా రోజు 90 అత్యాచారాలు జరుగుతున్నాయని.. వీటిని అరికట్టడానికి కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రధాని మోడీని లేఖలో కోరారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అత్యాచార ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కోల్కతాలోని ఆర్జి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరంతరం విమర్శలకు గురవుతున్న తరుణంలో సీఎం మమత ప్రధానికి లేఖ రాయడం చర్చనీయంశంగా మారింది.
ఇదిలా ఉంటే, నిందితుడి అత్త తన అల్లుడిని ఉరితీయాలని డిమాండ్ చేసింది. నా కుమార్తెను అతను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి పెళ్లై రెండేళ్లు అయిందని, మొదట్లో 6 నెలలు అంతా బాగానే ఉందని, నా కుమార్తె 3 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో సంజయ్ రాయ్ కొట్టాడని, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అప్పటి నుంచి తన కుమార్తె అనారోగ్యంగానే ఉందని, ఆమె మందుల ఖర్చులన్నీ నేను భరించలేదని చెప్పారు.
ఇదిలా ఉంటే దేశంలో సంచలనంగా నిలిచిన ఉన్నావ్, హత్రాస్ అత్యాచార ఘటనల్ని దర్యాప్తు చేసిన ఇద్దరు సీనియర్ సీబీఐ అధికారులకు కోల్కతా డాక్టర్ కేసును అప్పగించారు. ఇంతకుముందు సంచలనాత్మ కేసుల్లో దర్యాప్తు చేసి విజయం సాధించిన వీరిద్దరు ఇప్పుడు కోల్కతా కేసుని డీల్ చేయబోతున్నారు.
బీజేపీ మమతా బెనర్జీని ‘‘నిర్మమతా బెనర్జీ’’గా పేర్కొంది. ఈ భయంకరమైన సంఘటన తర్వాత ఆమె పేరు మార్చాలని దుయ్యబట్టింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ.. మమతా బెనర్జీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ‘విధ్వంసకురాలి’’గా మారారని అన్నారు. ఆమె తన దుశ్చర్యలతో సమాజానికి సేవ చేస్తున్న ఒక మహిళా డాక్టర్ గౌరవాన్ని నాశనం చేశారని అన్నారు.
Kolkata Doctor Case: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్పై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ని సీబీఐ గత రెంమూడు రోజులుగా విచారిస్తోంది. విచారణ…
Kolkata doctor case: కోల్కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ ‘‘పాలిగ్రాఫ్ టెస్ట్’’ నిర్వహించాలని సీబీఐ పిటిషన్కి కలకత్తా హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో గత శుక్రవారం 31 ఏళ్ల వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది.
Kolkata Doctor Case: కోల్కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన యావద్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ఎన్నో అనుమానాలు వస్తున్నా్యి. చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిదని బాధితురాలి తల్లిదండ్రులు ఇప్పటికే ఆరోపించారు. మ
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యసిబ్బంది, విద్యార్థులతో సహా పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి హద్దు దాటి వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా పోస్టు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. Also…