Mamata Banerjee: డాక్టర్ ఫ్యామిలీకి డబ్బులు ఆఫర్ చేయడంపై మమత ఏమన్నారంటే..!
- డాక్టర్ ఫ్యామిలీకి డబ్బులు ఆఫర్ చేయడంపై స్పందించిన మమత
- లంచం ఆఫర్ వార్తలను ఖండించిన బెంగాల్ సీఎం
- కుట్రలో భాగంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో బాధిత కుటుంబానికి పోలీసులు డబ్బులు ఆఫర్ చేశారంటూ గత వారం వార్తలు హల్చల్ చేశాయి. బాధితురాలి తండ్రి ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు. దీంతో మీడియాలో కథనాలు సంచలనంగా మారాయి. తాజాగా సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. డబ్బులు ఆఫర్ చేసిన వార్తలను ఖండించారు. వామపక్ష పార్టీల ప్రమేయంతో కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. కేవలం ఇదొక అపవాదు మాత్రమేనని కొట్టిపారేశారు.
ఇది కూడా చదవండి: Tragedy: బుడమేరులో శవమై తేలిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
Also Read
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
- Amit Shah-Om Birla: లోక్సభ స్పీకర్కు అమిత్ షా లేఖ.. దేనికోసమంటే..!
- NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్షీట్
కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసును కప్పిపుచ్చడానికి పోలీసులు ప్రయత్నించారని.. నిశ్శబ్దంగా ఉండటానికి పోలీసులు తమకు లంచం ఆఫర్ చేశారని బాధితురాలి తండ్రి గత వారం ఆరోపించారు. పోలీసులు మొదటి నుంచి కేసును మూసివేయడానికి ప్రయత్నించారని.. కనీసం మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించలేదని వాపోయారు. పోస్టుమార్టానికి తీసుకెళ్లే సమయంలో పోలీస్ స్టేషన్లో వేచి ఉండాల్సి వచ్చిందని… మృతదేహాన్ని అప్పగించేటప్పుడు ఒక సీనియర్ పోలీస్ అధికారి డబ్బు ఇచ్చాడని.. వెంటనే తిరస్కరించినట్లు బాధితురాలి తండ్రి చెప్పుకొచ్చాడు.
సోమవారం ఇదే అంశంపై మమత మాట్లాడుతూ.. డబ్బు జీవితానికి పరిహారం కాదని బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పానన్నారు. కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా అర్థవంతమైనది చేయాలని భావిస్తే.. ప్రభుత్వం వారి పక్షాన నిలుస్తుందన్నారు. వారు తనను కలవవచ్చని మమత చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: తెలుగు భాష ముఖ్యం కాదంటే.. అక్కడి వారిని అవమానించిట్లే..
ఆగస్టు 9న కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసు దర్యాప్తు సవ్యంగా జరగడం లేదని.. కోల్కతా హైకోర్టు జోక్యం చేసుకుని సీబీఐకి అప్పగించింది. ఇక సోమవారం స్టేటస్ రిపోర్టును సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది. కానీ దీనిపై న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. వారం రోజులు గడువు ఇచ్చి.. మరో రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Dr K Laxman: బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదు..
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
-
Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
-
Explainer: తమిళ మీడియం కుర్రాడు.. టాటా గ్రూప్ను ఎలా నడిపించారు?
-
Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..