Mamata Banerjee: డాక్టర్ ఫ్యామిలీకి డబ్బులు ఆఫర్ చేయడంపై మమత ఏమన్నారంటే..!
- డాక్టర్ ఫ్యామిలీకి డబ్బులు ఆఫర్ చేయడంపై స్పందించిన మమత
- లంచం ఆఫర్ వార్తలను ఖండించిన బెంగాల్ సీఎం
- కుట్రలో భాగంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో బాధిత కుటుంబానికి పోలీసులు డబ్బులు ఆఫర్ చేశారంటూ గత వారం వార్తలు హల్చల్ చేశాయి. బాధితురాలి తండ్రి ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు. దీంతో మీడియాలో కథనాలు సంచలనంగా మారాయి. తాజాగా సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. డబ్బులు ఆఫర్ చేసిన వార్తలను ఖండించారు. వామపక్ష పార్టీల ప్రమేయంతో కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. కేవలం ఇదొక అపవాదు మాత్రమేనని కొట్టిపారేశారు.
ఇది కూడా చదవండి: Tragedy: బుడమేరులో శవమై తేలిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసును కప్పిపుచ్చడానికి పోలీసులు ప్రయత్నించారని.. నిశ్శబ్దంగా ఉండటానికి పోలీసులు తమకు లంచం ఆఫర్ చేశారని బాధితురాలి తండ్రి గత వారం ఆరోపించారు. పోలీసులు మొదటి నుంచి కేసును మూసివేయడానికి ప్రయత్నించారని.. కనీసం మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించలేదని వాపోయారు. పోస్టుమార్టానికి తీసుకెళ్లే సమయంలో పోలీస్ స్టేషన్లో వేచి ఉండాల్సి వచ్చిందని… మృతదేహాన్ని అప్పగించేటప్పుడు ఒక సీనియర్ పోలీస్ అధికారి డబ్బు ఇచ్చాడని.. వెంటనే తిరస్కరించినట్లు బాధితురాలి తండ్రి చెప్పుకొచ్చాడు.
సోమవారం ఇదే అంశంపై మమత మాట్లాడుతూ.. డబ్బు జీవితానికి పరిహారం కాదని బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పానన్నారు. కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా అర్థవంతమైనది చేయాలని భావిస్తే.. ప్రభుత్వం వారి పక్షాన నిలుస్తుందన్నారు. వారు తనను కలవవచ్చని మమత చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: తెలుగు భాష ముఖ్యం కాదంటే.. అక్కడి వారిని అవమానించిట్లే..
ఆగస్టు 9న కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసు దర్యాప్తు సవ్యంగా జరగడం లేదని.. కోల్కతా హైకోర్టు జోక్యం చేసుకుని సీబీఐకి అప్పగించింది. ఇక సోమవారం స్టేటస్ రిపోర్టును సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది. కానీ దీనిపై న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. వారం రోజులు గడువు ఇచ్చి.. మరో రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Dr K Laxman: బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదు..
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!