Bangladesh: “జమ్మూ కాశ్మీర్ విడిపోవాలి, మమతా బెనర్జీ స్వాతంత్య్రం ప్రకటించుకోవాలి”.. బంగ్లా ఉగ్రనేత వార్నింగ్..
- భారత్కి బంగ్లా ఉగ్రనేతల వార్నింగ్స్..
- జమ్మూ కాశ్మీర్.. ఈశాన్య రాష్ట్రాలను విడగొడతామంటూ ప్రగల్భాలు..
- అన్సరుల్ బంగ్లా టీమ్(ఏబీటీ) చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని మమతా బెనర్జీకి సలహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ఉగ్రవాదం, ర్యాడికల్ ఇస్లామిక్ నేతలుగా పేరొందిన వారిని ఉగ్రవాదులుగా గుర్తిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం వారందరిని అరెస్ట్ చేసింది. వారి సంస్థలపై నిషేధం విధించింది. అయితే, హసీనా గద్దె దిగడంతో ప్రస్తుతం ఆ దేశం తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇదిలా ఉంటే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత జైళ్లలో ఉన్న పలువురు ఉగ్రవాద నేతలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రానురాను ఆ దేశంలో మతోన్మాదం, ఉగ్రవాదం పెరుగుతోంది.
బంగ్లాదేశ్కి చెందిన రాడికల్ ఇస్లామిస్ట్ నేత మహ్మద్ జాసియుద్దీన్ రహ్మానీ భారత్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ని భారత్ నునంచి విడదీయాలని పిలుపునిచ్చాడు. నిషేధిత తీవ్రవాద సంస్థ ‘‘అన్సరుల్లా బంగ్లా టీమ్(ఏబీటీ)’’కి ఇతను చీఫ్గా ఉన్నాడు. ఇతను తన భారత వ్యతిరేక ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల మద్దతు కోరాడు.
Also Read
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
రెహ్మాని వరసగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇతడు చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘‘ నేను భారతదేశాన్ని హెచ్చరిస్తున్నా. బంగ్లాదేశ్ సిక్కిం, భూటాన్ లాంటిది కాదు. ఇది 18 కోట్ల ముస్లింల దేశం. మీరు బంగ్లాదేశ్ వైపు అడుగు వేస్తే ‘‘చికెన్ నెక్’’ మూయాలని మేము చైనాకు చెబుతాం.’’ అని వార్నింగ్ ఇచ్చాడు. చికెన్ నెక్ అనేది భారత్లోని ఇతర భాగాలను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే సన్నని ఇరుకైన మార్గం. దీనినే ‘సిలిగురి’ కారిడార్గా పిలుస్తాం.
ఇదే కాకుండా ‘‘ఈశాన్య రాష్ట్రాలను’’ విడగొడతామని బెదిరించాడు. కాశ్మీర్ స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సాయం చేస్తాయని చెప్పాడు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్తో పాటు ఇతర ప్రాంతాల్లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా కామెంట్స్ చేశాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీ పాలన నుంచి విముక్తి చేసి స్వాతంత్య్రం ప్రకటించుకోవాలని కోరాడు. పంజాబ్లో ఖలిస్తాన్కి తాను మద్దతు ఇస్తానని ప్రకటించాడు. షేక్ హసీనాను గద్దె దించిన విధంగానే ఢిల్లీని కూడా స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చాడు. మీ దేశం కూడా విచ్ఛిన్నమయ్యే రోజు చాలా దూరంలో లేదని అవాకులు చెవాకులు పేలాడు. ఢిల్లీ పైన తౌహీద్ జెండాలు రెపరెపలాడుతాయని చెప్పాడు.
రెహ్మానిని 2013లో ఉగ్రవాద నేరాల కింద అరెస్ట్ చేశాడు. ఏబీటీ కార్యకలాపాలపై రాసినందుకు బ్లాగర్ రాజీబ్ హైదర్ని హత్య చేసిన నేరంలో రహ్మానీకి ఐదేళ్ల శిక్ష పడింది. ఈ ఏబీటీకి ఆల్ఖైదాతో సంబంధాలు ఉన్నాయి. 2015లో దీనిని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఇది రాడికల్ భావాలను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..