పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హస్తిన వేదికగా ‘‘సర్’’పై పోరాటానికి దిగారు. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలిసి తన నిరసన తెలియజేశారు. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం వేదికగా తన నిరసనను వ్యక్తపరిచారు.
Mood of the Nation Survey 2026: దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు తిరుగులేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ సొంతగా 287 సీట్లను సాధించి అధికారంలోకి వస్తుందని, ఎన్డీయే కూటమి 350కిపైగా స్థానాలు సాధిస్తుందని ‘‘మూడ్ ఆఫ్ ది నేషన్’’ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1.25 లక్షల కంటే ఎక్కువ మంది అభిప్రాయాలతో ఈ సర్వే చేసింది.
Sharad Pawar: అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ కురువృద్ధుడు శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ మరణంలో ఎలాంటి కుట్ర లేదని, ఇది కేవలం ప్రమాదమే అని స్పష్టం చేశారు. ఈ విషాదాన్ని రాజకీయ చేయొద్దని ఇతర పార్టీలు, నేతలను కోరారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వంటి వారు అజిత్ పవార్ మరణంపై అనుమానాలను వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షనలో దర్యాప్తుకు పిలుపునిచ్చారు. అన్న కొడుకైన అజిత్ పవార్…
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణ వార్తతో తీవ్ర షాక్కు గురైనట్లు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. అజిత్ పవార్ ఆకస్మిక మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎక్స్లో పేర్కొన్నారు.
త్వరలోనే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇక ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కూడా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ నువ్వానేనా? అన్నట్టుగా ఢీకొంటున్నాయి.
BJP Leader: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా, బీజేపీ సీఎం మమతా బెనర్జీపై విరుచుపడింది. బీజేపీ నాయకుడు సంజయ్ దాస్ టీఎంసీ అధినేత్రిని ఉద్దేశించి సంచనల వ్యాఖ్యలు చేశారు.
PM Modi: పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. బీహార్లో ‘‘జంగిల్ రాజ్’’ను బీజేపీ, ఎన్డీయే అంతం చేశాయని, బెంగాల్ కూడా టీఎంసీ ‘‘మహా జంగిల్ రాజ్’’ను అంతం చేయాలని ప్రధాని ఆదివారం అన్నారు. సింగూర్లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. బెంగాల్లో పాలనను మార్చాలని అసవరం ఉందని ఆయన అన్నారు. Read Also: Greenland: డెన్మార్క్ చిన్నదేశం, గ్రీన్లాండ్ను కంట్రోల్ చేయలేదు.. ట్రంప్ సహాయకుడి…
PM Modi: పశ్చిమ బెంగాల్ మాల్దాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) , సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. టీఎంసీ ప్రభుత్వాన్ని మార్చాలని అవసరం ఉందని అన్నారు. దయలేని, క్రూరమైన మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజల డబ్బును దోచుకుంటోందని, కేంద్ర సహాయాన్ని బెంగాల్ ప్రజలకు చేరకుండా అడ్డుకుంటోందని ఆయన శనివారం అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగాల్ అభివృద్ధికి దోహదపడుతుందని హామీ ఇచ్చారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ-ఈడీ మధ్య నెలకొన్న ఫైటింగ్ సుప్రీంకోర్టుకు చేరింది. గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సర్కార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్ర ఆరోపణలు చేసింది.
గత వారం కోల్కతాలో ఐ-ప్యాక్ కార్యాలయంపై ఈడీ ఊహించని రీతిలో దాడి చేసింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడుల వార్తలు వినగానే వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘటనాస్థలికి చేరుకుని అడ్డుకున్నారు. కీలకమైన పత్రాలు, హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు.