Off The Record: తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజార్టీ ఉండడంతో ఆ రెండూ కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. అదే సమయంలో…బీఆర్ఎస్ కూడా కాస్త గట్టిగా ప్రయత్నిస్తే… కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం గెలిచే అవకాశం ఉండేదన్న చర్చ కూడా జరిగింది. కానీ… తమకు పూర్తి స్థాయి బలం లేదని, అనవసరంగా పోటీ చేసి ఓడిపోయామని అనిపించుకోవడం ఎందుకంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఆ ప్రతిపాదనల్ని అంత సీరియస్గా తీసుకోలేదు.…
AI deepfake scam: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త స్కామ్స్ తో ప్రజల వద్ద నుండి డబ్బులు లాగేస్తున్నారు. తాజాగా దేశ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోటోలు, వీడియోలనే వాడుకుంటూ కేటుగాళ్లు రెచ్చిపోయారు. డీప్ ఫేక్ (AI) సాంకేతికతతో సృష్టించిన నకిలీ వీడియోను చూసి నిజమని నమ్మిన ఓ వృద్ధురాలు ఏకంగా రూ. 87.96 లక్షలు పోగొట్టుకున్న ఘటన మల్కాజిగిరిలో వెలుగుచూసింది. Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై…
Hyderabad: మల్కాజిగిరి పరిధిలోని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
హుజూరాబాద్.. పొలిటికల్గా తెలంగాణ మొత్తం మీద ప్రత్యేక గుర్తింపు ఉన్న కొద్ది నియోజకవర్గాల్లో ఒకటి. సీనియర్ లీడర్ ఈటల రాజేందర్కి నిన్న మొన్నటి దాకా కంచుకోట ఇది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో... గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ రెండింట్లో పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయారాయన.
ఏడాదిగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ చేసిన అభివృద్ధిని వివరించడానికి ఈ సభ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. 11 ఏళ్లుగా మోడీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 11 ఏళ్లు పరిపాలన చేయడానికి ప్రజలు ఆమోదం తెలిపిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని కొనియాడారు. మరో 11 ఏళ్లు మోడీ పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని.. యూపీఏ ప్రభుత్వంలో ఏ వార్త చూసినా కుంభకోణాలు, అవినీతి…
Nitya Pellikoduku : మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ కేటుగాడి బాగోతం తాజాగా బయటపడింది. ఈ వ్యక్తి బండారం రెండో భార్య లీలావతి గుర్తించడంతో జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కేసు వివరాలు: మేడ్చల్ జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ గబ్బిబాల్పేట్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు (34) ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2014లో బంధువుల…
KP Vinekananda : మెట్రో ప్రాజెక్టును శామీర్ పేట, మేడ్చల్ వరకు విస్తరిస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం మెట్రో మూడో దశ విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకుందన్నారు కేపీ వివేకానంద. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో మూడో దశ విస్తరణకు కన్సల్టెంట్ ను కూడా కేసీఆర్ ప్రభుత్వం నియమించిందని, రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చి రాగానే కేసీఆర్ ఆనవాళ్లు…
మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలిచిన ఘటన జవహర్ నగర్ లో చోటుచేసుకుంది. వీధికుక్కలపై కర్రలతో దాడి చేసిన దుండగులు వాటిని చిత్ర హింసలకు గురిచేసి చంపారు.
మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలోని సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పని తీరు ఉండాలి తప్ప స్టాటిక్ గా ఉండకూడదు అని తెలిపారు.