Etela Rajender: ప్రజల సమస్యల కోసం ఎక్కడికైనా పోతా.. ఏమైనా చేస్తా..!
- సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మార్నింగ్ వాక్..
- ప్రతి చెరువు ఊరికి కన్నతల్లిలాగా పని చేసేది..
- ప్రస్తుతం ఒక రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతుంది: ఈటల రాజేందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలోని సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పని తీరు ఉండాలి తప్ప స్టాటిక్ గా ఉండకూడదు అని తెలిపారు. ప్రతి చెరువు ఊరికి కన్నతల్లిలాగా పని చేసేది.. మనకు మంచినీళ్లు ఇచ్చింది, రజకులకు చాకిరేవు అయింది, మత్స్యకారులకు మత్స్య సంపద అయింది, చెరువు ఎండిపోతే బతుకు ఎండి పోతుంది కాబట్టి చెరువులను కాపాడుకున్నాము.. కన్నతల్లి పాత్ర పోషించిన చెరువు ఇవాళ దుర్గంధపూరితంగా మారిపోయింది అని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో కొట్లాడను అదే విధంగా సమస్యల పరిష్కారానికి మళ్లీ వారి దగ్గరికి వెళ్లే వాడిని అని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆ సిస్టం లేదు.. ఏ సమస్య అయినా ముఖ్యమంత్రికి చెప్పే వాతావరణం ఉండాలి కానీ ఒక రాంగ్ ప్రాక్టీస్ రాజ్యమేలుతుంది ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.
Read Also: Nikhil Gupta : ఉగ్రవాది పన్ను హత్య కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
నేను మాత్రం ఏ పార్టీ ఎమ్మెల్యే అయిన, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాకున్న ఆలోచన ఒకటే.. ప్రజల సమస్యల కోసం ఎక్కడికైనా పోతా, ఎవరి దగ్గరకైనా పోతా, ఏ దరఖాస్తు అయిన ఇస్తా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నేను అధికారులను ఒకటే కోరుతున్నాను.. మీకు అన్ని గ్రౌండ్ నుంచి రిపోర్టులు వస్తాయి.. కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి అని కోరారు. నాకు ఈ పదవి కొనుక్కుంటే వచ్చింది కాదు.. మల్కాజ్గిరి ప్రజలు ఆత్మను ఆవిష్కరించి పెట్టిన బిక్షగా భావిస్తా.. వారిచ్చిన ఆశీర్వాదంగా భావిస్తానన్నారు. మల్కాజ్గిరిలో మీరు గతంలో పడ్డ బాధలు లేకుండా పరిష్కరించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.. గెలిచిన తర్వాత పార్లమెంట్లో ప్రధాని మోడీని కలిశాను.. మల్కాజ్గిరి ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణ చూసి ముగ్ధుడైన మోడీకి మనపై ఒక ప్రత్యేక అభిమానం ఉంది.. కాబట్టి ఏ సమస్య అయినా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!