Nitya Pellikoduku : మేడ్చల్ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు.. అరెస్ట్ చేసి అత్తారింటికి..!
- మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకున్న ర్యాపిడో డ్రైవర్
- ఒకరికి తెలియకుండా మరొకరితో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitya Pellikoduku : మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ కేటుగాడి బాగోతం తాజాగా బయటపడింది. ఈ వ్యక్తి బండారం రెండో భార్య లీలావతి గుర్తించడంతో జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
కేసు వివరాలు:
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్నగర్ గబ్బిబాల్పేట్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు (34) ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2014లో బంధువుల అమ్మాయి అనూషతో అతనికి వివాహమైంది. అయితే కొంతకాలానికే అనూషతో మనస్పర్థలు ఏర్పడి ఆమెతో దూరంగా ఉంటున్నాడు.
Also Read
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
రెండో పెళ్లి:
ఈ సమయంలో బాలాజీనగర్కు చెందిన లీలావతి (25)తో పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి 2021లో మెదక్ చర్చిలో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కానీ కొంతకాలానికే లీలావతితో కూడా విభేదాలు తలెత్తడంతో ఆమెను కూడా వదిలేసి తప్పించుకుని తిరగసాగాడు.
మూడో పెళ్లి:
2022లో శబరి అనే మరొక యువతితో పరిచయం పెంచుకున్న లక్ష్మణరావు, ఆమెను కూడా మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. మల్కాజిగిరి ప్రాంతంలో ఆమెతో కలిసి ఉంటున్నాడు.
రెండో భార్య లీలావతి కుటుంబ సభ్యులు లక్ష్మణరావు గురించి ఆరా తీసి మల్కాజిగిరి వద్ద అతని అడ్రెస్ తెలుసుకున్నారు. అక్కడకు చేరుకోగా అతను శబరితో జీవిస్తున్న విషయం బయటపడింది. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ మొత్తం ముగ్గురిని వివాహం చేసుకున్న విషయం వెలుగుచూసింది.
లీలావతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. విచారణ అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు. ఈ ఘటన జవహర్నగర్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ముగ్గురితో వివాహం చేసి వారి జీవితాలను మోసం చేయడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
తాజావార్తలు
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
-
Best Investment: నెలకు రూ.10 వేల పెట్టుబడి.. ఐదేళ్లకు కళ్లు చెదిరే లాభాలు.. చాట్ జీపీటీ చెప్పిన ప్లాన్ ఇదే..
-
Kiara Advani: ప్రతి రిలేషన్ మనకు.. ఏదో ఒక పాఠం నేర్పుతుంది..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!