హెచ్ఎస్సీ బోర్డ్ మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం మ్యాథమెటిక్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లను కూడా మేనేజ్మెంట్ సిబ్బంది లీక్ చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
మహారాష్ట్రలో అన్నదాతలు కదం తొక్కారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 10 వేల మందికి పైగా రైతులు కలిసి దాదాపు 200 కిలోమీటర్ల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహాపాదయాత్ర దిండోరి నుంచి ముంబయి వరకు జరుగుతోంది.
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన రాజకీయ లబ్ధి కోసమే హిందుత్వాన్ని విడిచిపెట్టి, సూడో సెక్యుటర్ ఎజెండాను అవలంభిస్తోందని బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన ఆరోపిస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అయితే ఈ విమర్శలకు ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగానే బదులిచ్చారు. బీజేపీ రథయాత్ర చేసినప్పుడు మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ శివసేన అని ఉద్దవ్ అన్నారు.
2 People Die Of Suspected H3N2 Virus: హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో వందల్లో ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికే హెచ్3ఎన్2 కారణంగా పలువురు మరణించారు. కర్ణాటకలోని హసన్ లో తొలి హెచ్3ఎన్2 వైరస్ మరణం నమోదు అయింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రాష్ట్రంలో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది.
Pune: పూణేలో ఘోరం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఫ్లాట్ లో శవాలై కనిపించారు. అయితే పోలీసులు ఇది హత్య-ఆత్మహత్య ఘటనగా అనుమానిస్తున్నారు. భార్య, పిల్లల ముఖాలకు పాలిథీన్ సంచులు చుట్టి ఉండటంతో పాటు భర్త ఉరేసుకుని ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే 44 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అతడి భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు బుధవారం పూణేలోని ఔంద్ ప్రాంతంలోని వారి ఫ్లాట్లో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని సుదీప్తో…
తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్. దేశ రాజకీయలను శాసించేందుకు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన కేసీఆర్..దూకుడుగా తమ రాజకీయ ప్రణాళికలను అమలు చేస్తున్నారు
ఈ మధ్య కుక్కుల దాడి ఘటనలు అధికమవుతున్నాయి. వీధుల్లో కుక్కల స్వైరవిహారంతో ప్రజలు అవస్థలు తప్పడం లేదు. నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కుక్క కాటుకు ప్రజలు ఆస్పత్రులు పాలవుతున్నారు.
ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడిందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే ఆదివారం ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని శివసేనగా గుర్తించి దానికి విల్లు, బాణం గుర్తును కేటాయించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.
శివసేన ఎమ్మెల్యే ప్రకాష్ సర్వే బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నాయకురాలిని ముద్దుపెట్టుకోవడం వివాదాస్పదమైంది. శివసేన నాయకురాలు శీతల్ మ్హత్రేను సర్వే ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Kidnap: పెళ్లి కోసం మహారాష్ట్ర నుంచి నిరుపేద, మైనర్ బాలికలను అపహరించి పొరుగు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్లలో అమ్ముతూ కొన్ని లక్షల వ్యాపారం చేస్తున్నారు.