H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 కలకలం.. ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 People Die Of Suspected H3N2 Virus: హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో వందల్లో ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికే హెచ్3ఎన్2 కారణంగా పలువురు మరణించారు. కర్ణాటకలోని హసన్ లో తొలి హెచ్3ఎన్2 వైరస్ మరణం నమోదు అయింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రాష్ట్రంలో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది.
మహారాష్ట్రలో ఇన్ఫ్లుఎంజా కారణంగా ఇద్దరు మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో ఒకరు 74 ఏళ్ల వ్యక్తి హెచ్3ఎన్2తో మరణించగా, మరొకరు కోవిడ్, హెచ్3ఎన్2 సోకడంతో మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 361 ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదు అయినట్లు, రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేస్తామని మంత్రి తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని మంత్రి సూచించారు.
Also Read
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
Read Also: Rapido: “నీ డీపీ చూసి, నీ వాయిస్ వినే వచ్చా”.. మహిళకు రాపిడో డ్రైవర్ అనుచిత మెసేజ్..
నాగ్ పూర్ కు చెందిన 74 ఏళ్ల వ్యక్తి హెచ్3ఎన్2తో మరణించారు. అహ్మద్ నగర్ కు చెందిన 23 ఏళ్ల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి కోవిడ్ 19, హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్ కలిగి ఉన్నారు. ఇతను కూడా మరణించాడు. ముంబై, పూణే, నాగ్పూర్, ఔరంగాబాద్, థానే, సాంగ్లీ మరియు కొల్హాపూర్లలో ఇన్ఫ్లుఎంజా కేసులు కనుగొనబడ్డాయి.
జ్వరం, దగ్గు, గొంతునొప్పి, న్యుమోనియా, కోవిడ్-19 లక్షణాలు ఈ హెచ్3ఎన్2 వైరస్ లో కనిపిస్తున్నాయి. మార్చి చివరి నాటికి ఈ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్రం ఇటీవల వెల్లడించింది. వైద్యుల సలహాతో టామీ ఫ్లూ మందు తీసుకుంటే జ్వరం 48 నుంచి 72 గంటల్లో తగ్గుతుందని మంత్రి సావంత్ వెల్లడించారు. అయితే వైద్యుల సూచనలు లేకుండా సొంత వైద్యం, యాంటీ బయాటిక్స్ వాడొద్దని కేంద్రం ప్రజలు విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!