Ram Navami violence: శ్రీరామ నవమి రోజు ఆరు రాష్ట్రాల్లో హింసాకాండ జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు సమయంలో రెండు వర్గాల వారు ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వడం వంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. మహరాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్ లో మరొకరు మరణించారు. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను భవిష్యత్ లో సీఎంగా చూడాలని మహారాష్టలోని పుణెకు చెందిన ఓ ఐస్ క్రీం వ్యాపారి ఆశ పడుతున్నాడు. అంతేకాకుండా సచిన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని వినూత్నంగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు.
వేడివేడిగా ఉన్న పెనంపై కూర్చుని భక్తులను బాబా ఆశీర్వదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సంత్ గురుదాస్ మహరాజ్గా గుర్తించబడిన ఈ బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గోసంరక్షణ సంస్థలను నడుపుతున్నాడు.
Maharashtra: దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. మృగాళ్లు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఆడపిల్ల కనబడితే కామాంధులు రెచ్చిపోతున్నారు. నిర్భయ, దిశ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా రేపిస్టులు భయపడటం లేదు. ప్రతీ రోజు ఎక్కడో చోట అత్యాచార ఉదంతం బయటకు వస్తూనే ఉంది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.
తనను చూసి నవ్వే ప్రతి ఒక్కరికి సవాల్ విసిరి మరి వారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఈ కుర్రాడు.అతను మరెవరో కాదు ప్రతీక్ విఠల్ మోహితే. అయితే అతని శరీరమే అతనికి శాపంగా మారింది.ఎందుకంటే ప్రతీక్ అందరిలాగా కాకుండా పొట్టిగా ఉంటాడు.అంటే ప్రతీక్ కేవలం 3.4 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు.
Cyber Fraud: బ్యాంక్ ఫ్రాడ్స్, సైబర్ ప్రాడ్స్ గురించి ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. అత్యాశకు పోయి డబ్బులను పోగొట్టుకుంటున్నారు. తాము కొనని లాటరీ టికెట్ కు లాటరీ ఎలా తగిలింది.? తమకు తెలియకుండా గిప్టులు ఎవరు పంపిస్తారు.? అని ప్రశ్నించుకుంటే ప్రజలు ఈ మోసాలకు గురికారని అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో ఇంత అవగాహన పెరుగుతున్నా మోసపోయే వారు ఇంకా ఉంటున్నారు.
మహారాష్ట్ర పూణెలోని ఓ ఆటోరిక్షా డ్రైవర్పై గురువారం నాడు 18 ఏళ్ల యువతిని వేధింపులకు గురిచేసి, ముద్దుపెట్టుకున్నందుకు కేసు నమోదు చేశామని, అతన్ని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
హెచ్ఎస్సీ బోర్డ్ మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం మ్యాథమెటిక్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లను కూడా మేనేజ్మెంట్ సిబ్బంది లీక్ చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
మహారాష్ట్రలో అన్నదాతలు కదం తొక్కారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 10 వేల మందికి పైగా రైతులు కలిసి దాదాపు 200 కిలోమీటర్ల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహాపాదయాత్ర దిండోరి నుంచి ముంబయి వరకు జరుగుతోంది.