Aaditya Thackeray: ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaditya Thackeray: ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడిందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య ఠాక్రే ఆదివారం ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని శివసేనగా గుర్తించి దానికి విల్లు, బాణం గుర్తును కేటాయించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో సీఎం అంటే కరెప్ట్మ్యాన్(అవినీతిపరుడు)గా మారిందని ఎద్దేవా చేశారు. అక్రమ, రాజ్యాంగ విరుద్ధమైన ముఖ్యమంత్రి తప్పకుండా వెళ్లాల్సిందేనన్నారు.
ఉత్తర ముంబైలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో థాకరే మాట్లాడుతూ.. శివసేన (యూబీటీ)కి కేటాయించిన మండుతున్న టార్చ్ (మషాల్) గుర్తు మాత్రమే ద్రోహం, వెన్నుపోటు కారణంగా ఏర్పడిన చీకటిని ప్రకాశవంతం చేస్తుందని అన్నారు. కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో, తుపాను, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల కష్టాలను తీర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైతే.. ప్రభుత్వాన్ని కూల్చివేసే పనిలో షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పని చేశారని ఆయన అన్నారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్రను స్వర్ణయుగానికి తీసుకెళ్తోందని మాజీ మంత్రి అన్నారు. రెండున్నరేళ్ల ఎంవీఏ హయాంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 93 శాతం పెట్టుబడి ప్రతిపాదనలు అమలు చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టడం తప్పా .. బీజేపీ చేసిందేముందని ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.
Also Read
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
Read Also: Potatoes Export: ఆగ్రా నుంచి మలేషియా, ఖతార్, దుబాయ్లకు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు
రైతులకు రుణమాఫీ చేయడం ఎంవీఏ ప్రభుత్వం చేసిన అతి ముఖ్యమైన పని అన్నారు. మహారాష్ట్రకు ద్రోహాలు ఇష్టం లేదని, గడువు ముగిసినా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడానికి ఇదే కారణమని అని వర్లి ఎమ్మెల్యే అన్నారు. ఎంవీఏ పాలనలో మహారాష్ట్ర ఆకర్షించిన పెట్టుబడులను గుజరాత్కు (ఏక్నాథ్ షిండే-బీజేపీ హయాంలో) తరలించారని ఆయన అన్నారు. ముంబై నగరపాలక ఎన్నికలు ఎప్పుడు జరిగినా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. షిండే శిబిరంలోకి ఫిరాయించిన 40 మంది ఎమ్మెల్యేలలో ఎవరూ తాము డబ్బు తీసుకోలేదని స్పష్టంగా చెప్పలేదని ఆదిత్య ఠాక్రే చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ విధేయతలను షిండే శిబిరానికి మార్చుకోవడంలో డబ్బు మార్పిడి జరిగిందని ఠాక్రే శిబిరం ఆరోపించింది.
తాజావార్తలు
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!