Uddhav Thackeray: లౌకికవాదం కోసమే వాజ్పేయ్ ప్రధాని అయ్యారు.. హిందుత్వాన్ని విడిచింది మీరా..? మేమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన రాజకీయ లబ్ధి కోసమే హిందుత్వాన్ని విడిచిపెట్టి, సూడో సెక్యుటర్ ఎజెండాను అవలంభిస్తోందని బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన ఆరోపిస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అయితే ఈ విమర్శలకు ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగానే బదులిచ్చారు. బీజేపీ రథయాత్ర చేసినప్పుడు మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ శివసేన అని ఉద్దవ్ అన్నారు.
Read Also: H3N2 Virus: మహారాష్ట్రలో హెచ్3ఎన్2 కలకలం.. ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం వెల్లడి
Also Read
కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న బీజేపీలో అధ్వానీ మాత్రమే కీలక వ్యక్తి అని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు జయలలిత, ఇతర పార్టీల మద్దతును బీజేపీ కోరినప్పుడు, లౌకికవాదం కోసం అద్వానీని వ్యతిరేకించారని ఆ సమయంలో అటల్ బీహారీ వాజ్ పేయి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. కాబట్టి హిందూ మతాన్ని ఎవరు విడిచిపెట్టనట్లు, బీజేపీనా..? శివసేనా..? అని ప్రశ్నించారు.
ప్రస్తుతం మీడియా చేతిలో కలం లేదని కమలం ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభాల్లో మూడు పడిపోయాయని, కేవలం న్యాయవ్యవస్థ మాత్రమే మిగిలి ఉందని అన్నారు. 2022 జూన్ లో మహారాష్ట్ర శివసేనలో తిరుగుబాటు సమయంలో అనర్హత వేటు పడిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణకు వెళ్తున్న సందర్భంలో ఉద్దవ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
-
Sunil Narang: ‘ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
-
Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!