Maharashtra: దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు. మృగాళ్లు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా ఆడపిల్ల కనబడితే కామాంధులు రెచ్చిపోతున్నారు. నిర్భయ, దిశ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా రేపిస్టులు భయపడటం లేదు. ప్రతీ రోజు ఎక్కడో చోట అత్యాచార ఉదంతం బయటకు వస్తూనే ఉంది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.
తనను చూసి నవ్వే ప్రతి ఒక్కరికి సవాల్ విసిరి మరి వారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఈ కుర్రాడు.అతను మరెవరో కాదు ప్రతీక్ విఠల్ మోహితే. అయితే అతని శరీరమే అతనికి శాపంగా మారింది.ఎందుకంటే ప్రతీక్ అందరిలాగా కాకుండా పొట్టిగా ఉంటాడు.అంటే ప్రతీక్ కేవలం 3.4 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు.
Cyber Fraud: బ్యాంక్ ఫ్రాడ్స్, సైబర్ ప్రాడ్స్ గురించి ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా మోసాలకు అడ్డుకట్ట పడటం లేదు. అత్యాశకు పోయి డబ్బులను పోగొట్టుకుంటున్నారు. తాము కొనని లాటరీ టికెట్ కు లాటరీ ఎలా తగిలింది.? తమకు తెలియకుండా గిప్టులు ఎవరు పంపిస్తారు.? అని ప్రశ్నించుకుంటే ప్రజలు ఈ మోసాలకు గురికారని అధికారులు చెబుతున్నారు. ప్రజల్లో ఇంత అవగాహన పెరుగుతున్నా మోసపోయే వారు ఇంకా ఉంటున్నారు.
మహారాష్ట్ర పూణెలోని ఓ ఆటోరిక్షా డ్రైవర్పై గురువారం నాడు 18 ఏళ్ల యువతిని వేధింపులకు గురిచేసి, ముద్దుపెట్టుకున్నందుకు కేసు నమోదు చేశామని, అతన్ని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
హెచ్ఎస్సీ బోర్డ్ మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం మ్యాథమెటిక్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లను కూడా మేనేజ్మెంట్ సిబ్బంది లీక్ చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
మహారాష్ట్రలో అన్నదాతలు కదం తొక్కారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 10 వేల మందికి పైగా రైతులు కలిసి దాదాపు 200 కిలోమీటర్ల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మహాపాదయాత్ర దిండోరి నుంచి ముంబయి వరకు జరుగుతోంది.
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన రాజకీయ లబ్ధి కోసమే హిందుత్వాన్ని విడిచిపెట్టి, సూడో సెక్యుటర్ ఎజెండాను అవలంభిస్తోందని బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే శివసేన ఆరోపిస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. అయితే ఈ విమర్శలకు ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగానే బదులిచ్చారు. బీజేపీ రథయాత్ర చేసినప్పుడు మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ శివసేన అని ఉద్దవ్ అన్నారు.
2 People Die Of Suspected H3N2 Virus: హెచ్3ఎన్2 ఇన్ఫ్లుఎంజా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో వందల్లో ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటికే హెచ్3ఎన్2 కారణంగా పలువురు మరణించారు. కర్ణాటకలోని హసన్ లో తొలి హెచ్3ఎన్2 వైరస్ మరణం నమోదు అయింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రాష్ట్రంలో ఇద్దరు మరణించడంతో అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది.
Pune: పూణేలో ఘోరం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఫ్లాట్ లో శవాలై కనిపించారు. అయితే పోలీసులు ఇది హత్య-ఆత్మహత్య ఘటనగా అనుమానిస్తున్నారు. భార్య, పిల్లల ముఖాలకు పాలిథీన్ సంచులు చుట్టి ఉండటంతో పాటు భర్త ఉరేసుకుని ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే 44 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అతడి భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు బుధవారం పూణేలోని ఔంద్ ప్రాంతంలోని వారి ఫ్లాట్లో శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని సుదీప్తో…