Uddav Thackeray: ఇది నియంతృత్వ అంతానికి నాంది.. కేంద్రంపై ఉద్ధవ్ ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddav Thackeray: రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడంపై ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంపై మండిపడ్డారు. శివసేన (యూబీటీ) పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటును ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంగా అభివర్ణించారు. ఇది నియంతృత్వ అంతానికి నాంది అని అన్నారు. ప్రస్తుతం దొంగను దొంగ అని పిలవడం నేరంగా మారిందని, అయితే దేశాన్ని దోపిడీ చేసేవారు బయటే ఉన్నారని ఉద్ధవ్ థాక్రే ఒక ప్రకటనలో అన్నారు. “ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం. అన్ని ఏజెన్సీలు ఒత్తిడిలో ఉన్నాయి. ఇది నియంతృత్వ ముగింపుకు నాంది.. యుద్ధానికి ఒక దిశ మాత్రమే అవసరం ” అని థాక్రే అన్నారు.
2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన మరుసటి రోజే, లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీని లోక్సభ నుంచి అనర్హులుగా ప్రకటించడం గమనార్హం. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఇది రాహుల్ను దోషిగా నిర్ధారించిన రోజు మార్చి 23 నుండి అమలులోకి వస్తుంది.
Also Read
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
Read Also: Amruta Fadnavis: అమృత ఫడ్నవీస్కు లంచం ఇచ్చేందుకు యత్నం.. మహిళకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
“కోర్టు ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, సూరత్ ఆయనను దోషిగా నిర్ధారించిన తర్వాత.. కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన తేదీ నుంచి అంటే 23 మార్చి, 2023 నుండి లోక్సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాడు.” నోటిఫికేషన్ పేర్కొంది. రాహుల్ గాంధీ తన నేరారోపణ, శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు.
తాజావార్తలు
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!