Sanjay Raut: బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం.. మహా వికాస్ అఘాడీలో లుకలుకలు
- మహా వికాస్ అఘాడీలో బయటపడుతున్న లుకలుకలు..
- బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా శివసేన(యూబీటీ)..
- బీఎంసీ ఎన్నికల్లో శివసేన కార్యకర్తలు ఒంటరిగా పోటీ చేయాలని కోరారు: సంజయ్ రౌత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్) కూటమి మధ్య లుకలుకలు బయటకు వస్తున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంవీఏ మిత్ర పక్షంతో పొత్తు పెట్టుకోవడం కష్టమేనని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని సూచనలు చేశారు.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ ఈవెంట్లో పవర్ స్టార్ మేనియా
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
అయితే, దేశ వాణిజ్యరాజధాని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను శివసేన ఏకంగా 25 ఏళ్ల పాటు నిర్విరామంగా పరిపాలన కొనసాగించిందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 1997 నుంచి 2022దాకా బీఎంసీపై శివసేన పట్టుకొనసాగింది. కానీ, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిగా కాకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుదామన్నారు.. ఒంటిగా పోటీ చేయాలని మా శివసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు.. అందుకే వారితో ఈ అంశాన్ని చర్చించేందుకు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారని వెల్లడించారు. ఇక, ఎంవీఏ కూటమిలో విభేదాలున్నాయన్న వాదనను సంజయ్ రౌత్ తోసిపుచ్చారు.
Read Also: Mohali Building Collapse: పంజాబ్లో కుప్పుకూలిన మూడంతస్తుల భవనం.. 15 గంటలకు రెస్క్యూ ఆపరేషన్
కాగా, శివసేన రెండుగా చీలకముందు కూడా మేం గతంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న సందర్భాల్లోనూ బీఎంసీ ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేశామని ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. పుణె, పింప్రి–చించ్వాడ్, నాసిక్ పురపాలిక ఎన్నికల్లో ఎంవీఏ కూటమి ఉమ్మడిగానే బరిలోకి దిగనుందని ప్రకటించారు. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మాదిరే అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ, బీజేపీలతో శివసేన ఉమ్మడిగా మహాయుతి కూటమిగా బీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!