Devendra Fadnavis: భారత్ జోడో యాత్రలో “అర్బన్ నక్సల్స్” పాల్గొన్నారు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు!
- మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..
- భారత్ జోడో యాత్రలో "అర్బన్ నక్సల్స్" పాల్గొన్నారు..
- భారత ఎన్నికలలో విదేశీ జోక్యం ఉంది: సీఎం ఫడ్నవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగిన భారత్ జోడో యాత్రలో “అర్బన్ నక్సల్స్” సంస్థలు పాల్గొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 15వ తేదీన ఖాట్మండులో జరిగిన రహస్య సమావేశంలో ఈవీఎంలను వ్యతిరేకించడంతో పాటు మహారాష్ట్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లను ప్రవేశ పెట్టడం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారని అసెంబ్లీ సమావేశాల్లో ఆరోపించారు. అలాగే, ఆర్థిక రాజధాని ముంబైలో అశాంతిని ప్రేరేపించడానికి అనేక కుట్రలు చేశారని తెలిపారు. ఇక, ఎన్నికల్లో టెర్రర్ ఫండ్స్ వినియోగంపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేసిన విచారణలో భారత ఎన్నికలలో విదేశీ జోక్యానికి గల ఆధారాలు ఉన్నాయని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
Read Also: Paritala Ravi: పరిటాల రవి హత్య కేసు.. బెయిల్పై విడుదలైన ఐదుగురు ముద్దాయిలు!
Also Read
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ఇక, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్లుగా కొనసాగుతున్న 40 సంస్థలు.. లోక్సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నాయని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అలాగే, 2014లో మన్మోహన్ సింగ్ సర్కార్ హయాంలో లోక్సభలో 72 ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల పేర్లను ప్రస్తావించిందన్నారు. ఇక, వాటిలో 7 సంస్థలు భారత్ జోడో యాత్రలో భాగమేనని పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) కోసం ఈ సంస్థలు ప్రచారం చేశాయన్నారు. అర్బన్ నక్సలిజాన్ని ఎదుర్కోవటానికి మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 2024ని అసెంబ్లీలో మహాయుతి ప్రభుత్వం సమర్పించింది.
తాజావార్తలు
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!