Devendra Fadnavis: భారత్ జోడో యాత్రలో “అర్బన్ నక్సల్స్” పాల్గొన్నారు.. ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు!
- మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు..
- భారత్ జోడో యాత్రలో "అర్బన్ నక్సల్స్" పాల్గొన్నారు..
- భారత ఎన్నికలలో విదేశీ జోక్యం ఉంది: సీఎం ఫడ్నవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగిన భారత్ జోడో యాత్రలో “అర్బన్ నక్సల్స్” సంస్థలు పాల్గొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన ఆరోపణలు చేశారు. నవంబర్ 15వ తేదీన ఖాట్మండులో జరిగిన రహస్య సమావేశంలో ఈవీఎంలను వ్యతిరేకించడంతో పాటు మహారాష్ట్ర, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్లను ప్రవేశ పెట్టడం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించారని అసెంబ్లీ సమావేశాల్లో ఆరోపించారు. అలాగే, ఆర్థిక రాజధాని ముంబైలో అశాంతిని ప్రేరేపించడానికి అనేక కుట్రలు చేశారని తెలిపారు. ఇక, ఎన్నికల్లో టెర్రర్ ఫండ్స్ వినియోగంపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చేసిన విచారణలో భారత ఎన్నికలలో విదేశీ జోక్యానికి గల ఆధారాలు ఉన్నాయని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
Read Also: Paritala Ravi: పరిటాల రవి హత్య కేసు.. బెయిల్పై విడుదలైన ఐదుగురు ముద్దాయిలు!
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
ఇక, కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఫ్రంటల్ ఆర్గనైజేషన్లుగా కొనసాగుతున్న 40 సంస్థలు.. లోక్సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నాయని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అలాగే, 2014లో మన్మోహన్ సింగ్ సర్కార్ హయాంలో లోక్సభలో 72 ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల పేర్లను ప్రస్తావించిందన్నారు. ఇక, వాటిలో 7 సంస్థలు భారత్ జోడో యాత్రలో భాగమేనని పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) కోసం ఈ సంస్థలు ప్రచారం చేశాయన్నారు. అర్బన్ నక్సలిజాన్ని ఎదుర్కోవటానికి మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 2024ని అసెంబ్లీలో మహాయుతి ప్రభుత్వం సమర్పించింది.
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!