Maharashtra: నిన్న ఫడ్నవిస్తో ఉద్ధవ్ థాక్రే.. నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ.. ఎంవీఏలో ఏం జరుగుతోంది!?
- నిన్న ఫడ్నవిస్తో ఉద్ధవ్ థాక్రే భేటీ
- నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ
- ఎంవీఏలో ఏం జరుగుతోంది!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. మహాయుతి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి మాత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కింది. దేవేంద్ర ఫడ్నవిస్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలు అయ్యారు.
ఇదిలా ఉంటే మహా వికాస్ అఘాడీ కూటమి పరాజయం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కూటమి నేతలు.. అధికార పార్టీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అడుగులు మెల్లమెల్లగా మహాయుతి వైపు పడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం అనూహ్యంగా ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి ముఖ్యమంత్రి ఫడ్నవిస్ను కలిశారు. భేటీ అనంతరం ఆదిత్య థాక్రే మాట్లాడుతూ… మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు ఇదొక ముందడుగు అని తెలిపారు. ఏ కూటమిలో ఉన్నా.. ప్రజాప్రతినిధులుగా.. అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
మరోవైపు ఫడ్నవిస్తో ఉద్ధవ్ థాక్రే కలిసి కొన్ని గంటలైనా గడవక ముందే.. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. మహారాష్ట్ర రైతులతో కలిసి ప్రధానిని కలిశారు. అయితే భేటీ ఉద్దేశాలు వేరైనా.. ప్రతిపక్ష నేతల వరుస భేటీలు మాత్రం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహా వికాస్ అఘాడీ నేతలు.. అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం కేంద్రం.. ఎంతో ప్రతిష్టాత్మకమైన జమిలి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందేందుకు ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ పార్టీ ఎంపీలను కలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కూడా ఈ విధమైన సంకేతం ఇచ్చారు. త్వరలో శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. బీజేపీలో చేరొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.
Rajya Sabha MP and former Union Minister Sharad Pawar, along with a group of farmers, met PM Narendra Modi today: PMO
(Pics: PMO/X) pic.twitter.com/SkSb1kSqmy
— ANI (@ANI) December 18, 2024
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!