Maharashtra: నిన్న ఫడ్నవిస్తో ఉద్ధవ్ థాక్రే.. నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ.. ఎంవీఏలో ఏం జరుగుతోంది!?
- నిన్న ఫడ్నవిస్తో ఉద్ధవ్ థాక్రే భేటీ
- నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ
- ఎంవీఏలో ఏం జరుగుతోంది!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. మహాయుతి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి మాత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కింది. దేవేంద్ర ఫడ్నవిస్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలు అయ్యారు.
ఇదిలా ఉంటే మహా వికాస్ అఘాడీ కూటమి పరాజయం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కూటమి నేతలు.. అధికార పార్టీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అడుగులు మెల్లమెల్లగా మహాయుతి వైపు పడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం అనూహ్యంగా ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి ముఖ్యమంత్రి ఫడ్నవిస్ను కలిశారు. భేటీ అనంతరం ఆదిత్య థాక్రే మాట్లాడుతూ… మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు ఇదొక ముందడుగు అని తెలిపారు. ఏ కూటమిలో ఉన్నా.. ప్రజాప్రతినిధులుగా.. అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
మరోవైపు ఫడ్నవిస్తో ఉద్ధవ్ థాక్రే కలిసి కొన్ని గంటలైనా గడవక ముందే.. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. మహారాష్ట్ర రైతులతో కలిసి ప్రధానిని కలిశారు. అయితే భేటీ ఉద్దేశాలు వేరైనా.. ప్రతిపక్ష నేతల వరుస భేటీలు మాత్రం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహా వికాస్ అఘాడీ నేతలు.. అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం కేంద్రం.. ఎంతో ప్రతిష్టాత్మకమైన జమిలి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందేందుకు ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ పార్టీ ఎంపీలను కలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కూడా ఈ విధమైన సంకేతం ఇచ్చారు. త్వరలో శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. బీజేపీలో చేరొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.
Rajya Sabha MP and former Union Minister Sharad Pawar, along with a group of farmers, met PM Narendra Modi today: PMO
(Pics: PMO/X) pic.twitter.com/SkSb1kSqmy
— ANI (@ANI) December 18, 2024
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!