Maharashtra: నిన్న ఫడ్నవిస్తో ఉద్ధవ్ థాక్రే.. నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ.. ఎంవీఏలో ఏం జరుగుతోంది!?
- నిన్న ఫడ్నవిస్తో ఉద్ధవ్ థాక్రే భేటీ
- నేడు ప్రధానితో శరద్ పవార్ భేటీ
- ఎంవీఏలో ఏం జరుగుతోంది!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. మహాయుతి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) కూటమి మాత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కింది. దేవేంద్ర ఫడ్నవిస్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలు అయ్యారు.
ఇదిలా ఉంటే మహా వికాస్ అఘాడీ కూటమి పరాజయం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష కూటమి నేతలు.. అధికార పార్టీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. అడుగులు మెల్లమెల్లగా మహాయుతి వైపు పడుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మంగళవారం అనూహ్యంగా ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య థాక్రేతో కలిసి ముఖ్యమంత్రి ఫడ్నవిస్ను కలిశారు. భేటీ అనంతరం ఆదిత్య థాక్రే మాట్లాడుతూ… మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు ఇదొక ముందడుగు అని తెలిపారు. ఏ కూటమిలో ఉన్నా.. ప్రజాప్రతినిధులుగా.. అభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన పేర్కొన్నారు.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
మరోవైపు ఫడ్నవిస్తో ఉద్ధవ్ థాక్రే కలిసి కొన్ని గంటలైనా గడవక ముందే.. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. మహారాష్ట్ర రైతులతో కలిసి ప్రధానిని కలిశారు. అయితే భేటీ ఉద్దేశాలు వేరైనా.. ప్రతిపక్ష నేతల వరుస భేటీలు మాత్రం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మహా వికాస్ అఘాడీ నేతలు.. అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం కేంద్రం.. ఎంతో ప్రతిష్టాత్మకమైన జమిలి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందేందుకు ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ పార్టీ ఎంపీలను కలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కూడా ఈ విధమైన సంకేతం ఇచ్చారు. త్వరలో శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. బీజేపీలో చేరొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీతో శరద్ పవార్ భేటీ ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.
Rajya Sabha MP and former Union Minister Sharad Pawar, along with a group of farmers, met PM Narendra Modi today: PMO
(Pics: PMO/X) pic.twitter.com/SkSb1kSqmy
— ANI (@ANI) December 18, 2024
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!