అమ్మ ప్రేమ.. లోకంలోనే మధురమైనది.. కడుపునపుట్టిన బిడ్డల కోసం ఎన్ని కష్టాలైనా భరించేది తల్లి ఒక్కటే.. చివరికి చావు బతుకుల మధ్య ఉన్నా కూడా ఆమె గుండె పిల్లల కోసమే కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటి తల్లి ప్రేమ.. పేదరికం ముందు ఓడిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో బిడ్డను ఎలా పోషించాలో తెలియని ఒక అభాగ్యురాలైన తల్లి.. తన మూడురోజుల బిడ్డను అమ్మేసింది. తన బిడ్డ అయిన తనలా కాకుండా పెరుగుతుందని అనుకున్నాడో ఏమో.. పిల్లలు లేని…
దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మూడో వేవ్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల్లో వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, తీసుకోవడానికి కొంతమంది ఇష్టపడటం లేదు. వ్యాక్సిన్ తీసుకోకుంటే ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. Read: తగ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా సరిహద్దుల్లో… ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని, థానే…
మహారాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి అనీల్ దేశ్ముఖ్ను మనీలాండరింగ్ కేసులోఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబై కార్యాలయంలో 12 గంటలపాటు సుధీర్ఘంగా అనీల్ దేశ్ముఖ్ను అధికారులు ప్రశ్నించారు. ముంబైలో బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే ను ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ ఆరోపణలు చేశారు. దీంలో ఎన్పోర్స్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి అనీల్ దేశ్ముఖ్కు నోటీసులు…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇండియాలో మెల్ల మెల్లగా సాధారణ వాతావరణం నెలకొంటోంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే థియేటర్లన్నీ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షక ఆదరణ కూడా బాగుంది. దీనిని చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా థియేటర్లను ఓపెన్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఆ బాటలో మహారాష్టలో ఈ నెల 22 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సంస్థ ఐనాక్స్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 22న మూవీ లవర్స్ కి…
దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. మరో పది రోజులపాటు ఇలాంటి పరిస్థితి కొనసాగవచ్చిన అధికారులు చెబుతున్నారు. అన్నిరాష్ట్రాలు బొగ్గుకొరతను ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్రలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో 13 విద్యుత్ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ను ఆచితూచి…
మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఇళ్లలో ఏకకాలం సోదాలు నిర్వహిస్తున్నారు సీబీఐ అధికారులు.. మహారాష్ట్రకు చెందిన ఈ మాజీ మంత్రిపై గతంలో కొన్ని అభియోగాలున్నాయి.. అయితే, ఇప్పుడు జరుగుతోన్న తనిఖీలు ఏ విషయంలో అనేదానిపై స్పష్టత లేదు.. కానీ, మాజీ మంత్రికి చెందిన వివిధ ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. నాగపూర్తో పాటు ముంబైలో ఉన్న ఆయన ఇల్లలో తనిఖీలు చేపట్టింది సీబీఐ.. నేరపూరిత కక్ష సాధింపు, అవినీతి ఆరోపణలపై గతంలో అనిల్ దేశ్ముఖ్తో…
ఈరోజు నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం తెరుచుకోబోతున్నది. కరోనా కారణంగా ఏప్రిల్ 5 వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ఆలయాన్ని తెరుస్తున్నారు. ప్రతిరోజూ 15 వేల మంది భక్తులకు మాత్రమే ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 65 ఏళ్లు దాటినవారు, గర్భిణిలు, పదేళ్లలోపు చిన్నారులకు అనుమతులు లేవని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా పూర్తిస్థాయి కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని,…
కరోనా ఫస్ట్ వేవ్తో పాటు సెకండ్ వేవ్ భారత్లో కల్లోలమే సృష్టించింది.. అయితే, భారత్లో ఎక్కువగా ఇబ్బంది పడింది.. ఎక్కువ కేసులు వెలుగు చూసింది మాత్రం మహారాష్ట్రలోనే.. ఇక, ఆ రాష్ట్ర రాజధాని ముంబైలోనే పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దీంతో.. మహారాష్ట్రతో పాటు ముంబైలో అక్టోబర్ 4 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. మొదట.. 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్…
గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మహారాష్ట్రలో వర్షాల కారణంగా.. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.. ఇక, యావత్మాల్ జిల్లాలో వరదలో బస్సు కొట్టుకుపోయింది.. దాహగాం పుల్మారాలో వాగు వంతెనపై నుంచి వదర నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా.. మహారాష్ట్ర ఎస్టీ బస్ను అలాగే పోనించాడు డ్రైవర్.. అయితే, వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో.. బస్సు కొట్టుకుపోయింది.. ఇక, స్థానికులు అప్రమత్తం అయ్యి.. బస్సులో ఉన్న ఇద్దరిని రక్షించినట్టు…
ప్రముఖ గీత రచయిత, స్క్రీన్ ప్లే రైటర్ జావేద్ అక్తర్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల ఆయన ఓ టీవీ ఛానెల్ చర్చా ఘోష్ఠిలో చేసిన వ్యాఖ్యల కారణంగా కోర్టు కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. థానే లోని కోర్టులో ఒకరు జావేద్ అక్తర్ పై పరువు నష్టం దావా వేశారు. విషయం ఏమంటే… ఆ మధ్య ఓ న్యూస్ టీవీ ఛానెల్ చర్చలో జావేద్ అక్తర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)ను తాలిబన్ల తో పోల్చుతూ…