Garlic: వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో.. రైతులు పంటని కాపాడుకోవడానికి రైతుల తిప్పలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garlic: వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ధరలు పెరిగాయి. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న రైతులు తమ పంటను కాపాడుకునేందుకు అనేక ఏర్పాట్లను చేసుకుంటునున్నారు. గతంలో టమాటో ధరలు పెరిగిన సందర్భంలో దొంగలు పంటల్ని దోపిడి చేసిన ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వెల్లుల్లి రైతులు పంట దోపిడి కాకుండా వినూత్న చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా మధ్యప్రదేశ్ చింద్వారాలో వెల్లుల్లి రైతులు తమ పంటలకు రక్షణగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర కిలోకి రూ. 400 నుంచి రూ. 500కి చేరుకోవడంతో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నప్పటికీ.. మరోవైపు దొంగల భయం వెన్నాడుతోంది.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Read Also: Israeli flight: థాయ్లాండ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న ఫ్లైట్ హైజాక్కి యత్నం..
13 ఎకరాల్లో వెల్లుల్లిని పండించడంలో రూ. 25 పెట్టుబడి పెట్టి వెల్లుల్లి సాగుదారు రాహుల్ దేశ్ముఖ్ ప్రస్తుతం ఆ పంటను అమ్మేసి దాదాపుగా రూ. 1 కోటి రాబడిని అందుకున్నాడు. సోలార్తో నడిచే కెమెరాలను పంటకు రక్షణగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు అదే ప్రాంతమైన బద్నూర్లో పవన్ చౌదరి అనే ఓ రైతుల 4 ఎకరాల్లో వెల్లుల్లి పంటను సాగు చేసి రూ. 6 లక్షల లాభం పొందినట్లు వెల్లడించారు. అయితే, పంటను రక్షించుకునేందు పొలంలో మొత్తం 3 సీసీటీవీలను ఏర్పాటు చేశానని, పంటను దొంగిలిస్తుండటంతో ఈ పని చేయాల్సి వచ్చిందన్నారు.
సాధారణంగా కిలో వెల్లుల్లి ధర సాధారణంగా రూ. 80 వరకు ఉంటుంది. అయితే ఈ సీజన్లో వెల్లుల్లి ధర ఏకంగా రూ.500 వరకు చేరుకుంది. దీంతో రైతులు తమ పంటకు ధర పెరిగిందని ఆనందిస్తున్నారు. మరోవైపు సామాన్యుడు వెల్లుల్లి కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ధర పెరుగుదలను చూడలేదని రైతులు చెబుతున్నారు.
#WATCH | In the wake of surging prices of garlic in Madhya Pradesh's Chhindwara, farmers have now come up with innovative measures to protect the produce by installing CCTV cameras in their fields. pic.twitter.com/CwaJbEPsh3
— ANI (@ANI) February 18, 2024
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..