Garlic : భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు.. పంటకు సీసీటీవీ, తుపాకీలతో కాపలా
Garlic : ఇప్పటి వరకు ఆభరణాల దుకాణాలు లేదా బ్యాంకుల వద్ద కాపలా కాస్తున్న తుపాకీ పట్టుకున్న గార్డులను చూసి ఉంటారు. అయితే పొలాల్లో ఇలాంటి దృశ్యాలు చూడడం కాస్త వింతగా అనిపించవచ్చు. కానీ మధ్యప్రదేశ్లో ప్రస్తుతం అలాంటిదే జరుగుతోంది. కారణం ఇక్కడ వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్రంలో వెల్లుల్లి ధర బాగా పెరిగిపోవడంతో రైతులు తమ పొలాల్లో కాపలాగా ఉండేందుకు తుపాకీ పట్టుకునే గార్డులను, సీసీ కెమెరాలను పెట్టుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో వెల్లుల్లి ధర రిటైల్ మార్కెట్లో రూ.400 దాటిందని, హోల్సేల్ మార్కెట్లో క్వింటాల్కు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పలుకుతున్నాయని పలువురు రైతులు పేర్కొంటున్నారు.
Read Also:Hussain Sagar: సాగర్లోకి మురుగు నీరు.. జలావరణానికి ప్రమాదముంటున్న పీసీబీ నివేదిక
Also Read
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని ఉజ్జయినిలోని చింతామన్ రోడ్డులోని మంగ్రోలా గ్రామంలో సెక్యూరిటీ గార్డులు, రైతులు తుపాకులు పట్టుకుని పంటలు పండిన పొలాల్లో తిరుగుతూ కనిపించారు. చాలా మంది సంపన్న రైతులు CCTVలను అమర్చారు. మానిటర్లలో తమ పొలాలను పర్యవేక్షిస్తున్నారు. చాలా మంది రైతుల పంటలను దొంగలు ఎత్తుకెళ్లారని రైతు భరత్సింగ్ బాయిస్ తెలిపారు. కాబట్టి ఇప్పుడు అతను వెల్లుల్లి పంటను తన 13 బిఘాలలో వేసి భూమిని కాపాడుతున్నాడు.
Read Also:UP : కౌశాంబిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, పలువురి పరిస్థితి విషమం
గత రెండేళ్లుగా వెల్లుల్లి సాగులో భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని, అయితే ఈ ఏడాది అదృష్టం కలిసివచ్చిందని బైస్ తెలిపారు. రైతులకు కిలో పంటకు రూ.200 లభిస్తోంది. మా వెల్లుల్లి పంట మరో 15 రోజుల్లో పండుతుంది కాబట్టి మేము మా పొలాన్ని ఈ విధంగా కాపాడుతున్నాము. భోపాల్కు చెందిన కూరగాయల వ్యాపారి మహ్మద్ సలీం, ఎకెఎస్ కంపెనీని నడుపుతూ, వెల్లుల్లి ధరలు ఈ స్థాయికి చేరుకోవడం తానెప్పుడూ చూడలేదన్నారు. ‘హోల్ సేల్ మార్కెట్ లో నాణ్యమైన వెల్లుల్లి ధర కిలో రూ.200 పలుకుతోంది. మధ్యప్రదేశ్ అంతటా హోల్సేల్ ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయని సలీం చెప్పారు.
తాజావార్తలు
-
Jowar Dosa : షుగర్కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!