Rahul Gandhi: రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర.. కాంగ్రెస్ కాపాడింది..
- Madhya Pradesh, Congress, Rahul Gandhi, Constitution, BJP, RSS, Jai Bapu Jai Bhim Jai Samvidhan
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మధ్యప్రదేశ్ మోవ్లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ర్యాలీని సోమవారం కాంగ్రెస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్పై మరోసారి విరుచుకుపడ్డారు. మన రాజ్యాంగాన్ని మార్చిన రోజు దేశంలో వెనకబడిన వారికి, దళితులకు, గిరిజనులకు ఒరిగేది ఏం ఉండదని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వ మనదేశంలో పేదలకు ఎలాంటి హక్కులు లేవని, కేవలం ధనికలకు మాత్రమే హక్కులు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా ఇదే కోరుకుంటోందని, వారు పేదలని, దళితులను, గిరిజనులను బానిసలుగా మార్చాలని భావిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Aham Brahmasmi: మరోసారి తెరపైకి అహం బ్రహ్మస్మి మోసాలు.. ఆశ్రమంలో బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తూ..
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
భారతదేశంలో ఒక వైపు రాజ్యాంగాన్ని విశ్వసించేు కాంగ్రెస్ ఉంటే, మరోవైపు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉందని అన్నారు. రాజ్యాంగం కేవలం పుస్తకం కాదని, భారతదేశ వేల ఏళ్ల ఆలోచన అని చెప్పారు. ఇందులో అంబేద్కర్, మహాత్మా గాంధీ, బుద్ధుడు, పూలే వంటి గొప్పవాళ్ల ఆలోచనలు దాగి ఉన్నట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల ముందు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ మాట్లాడిందని, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారని, కానీ కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు బీజేపీ అడ్డుకున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వల్లే ప్రధాని మోడీ లోక్సభలో రాజ్యాంగం ముందు తలవంచాల్సి వచ్చిందని చెప్పారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి పేదలు మౌనంగా ఉండాలని, ఆకలితో చనిపోవాలని భావిస్తున్నాయి, భారతదేశాన్ని కోటీశ్వరులు నడపాలని అనుకుంటున్నారని అంబానీ-అదానీలను ప్రస్తావిస్తూ ఆరోపించారు.
తాజావార్తలు
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!