Rahul Gandhi: రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర.. కాంగ్రెస్ కాపాడింది..
- Madhya Pradesh, Congress, Rahul Gandhi, Constitution, BJP, RSS, Jai Bapu Jai Bhim Jai Samvidhan
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మధ్యప్రదేశ్ మోవ్లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ర్యాలీని సోమవారం కాంగ్రెస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్పై మరోసారి విరుచుకుపడ్డారు. మన రాజ్యాంగాన్ని మార్చిన రోజు దేశంలో వెనకబడిన వారికి, దళితులకు, గిరిజనులకు ఒరిగేది ఏం ఉండదని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వ మనదేశంలో పేదలకు ఎలాంటి హక్కులు లేవని, కేవలం ధనికలకు మాత్రమే హక్కులు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా ఇదే కోరుకుంటోందని, వారు పేదలని, దళితులను, గిరిజనులను బానిసలుగా మార్చాలని భావిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Aham Brahmasmi: మరోసారి తెరపైకి అహం బ్రహ్మస్మి మోసాలు.. ఆశ్రమంలో బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తూ..
Also Read
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
భారతదేశంలో ఒక వైపు రాజ్యాంగాన్ని విశ్వసించేు కాంగ్రెస్ ఉంటే, మరోవైపు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉందని అన్నారు. రాజ్యాంగం కేవలం పుస్తకం కాదని, భారతదేశ వేల ఏళ్ల ఆలోచన అని చెప్పారు. ఇందులో అంబేద్కర్, మహాత్మా గాంధీ, బుద్ధుడు, పూలే వంటి గొప్పవాళ్ల ఆలోచనలు దాగి ఉన్నట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల ముందు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ మాట్లాడిందని, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారని, కానీ కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు బీజేపీ అడ్డుకున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వల్లే ప్రధాని మోడీ లోక్సభలో రాజ్యాంగం ముందు తలవంచాల్సి వచ్చిందని చెప్పారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి పేదలు మౌనంగా ఉండాలని, ఆకలితో చనిపోవాలని భావిస్తున్నాయి, భారతదేశాన్ని కోటీశ్వరులు నడపాలని అనుకుంటున్నారని అంబానీ-అదానీలను ప్రస్తావిస్తూ ఆరోపించారు.
తాజావార్తలు
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి