Rahul Gandhi: రాజ్యాంగంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర.. కాంగ్రెస్ కాపాడింది..
- Madhya Pradesh, Congress, Rahul Gandhi, Constitution, BJP, RSS, Jai Bapu Jai Bhim Jai Samvidhan
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మధ్యప్రదేశ్ మోవ్లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ర్యాలీని సోమవారం కాంగ్రెస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్పై మరోసారి విరుచుకుపడ్డారు. మన రాజ్యాంగాన్ని మార్చిన రోజు దేశంలో వెనకబడిన వారికి, దళితులకు, గిరిజనులకు ఒరిగేది ఏం ఉండదని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వ మనదేశంలో పేదలకు ఎలాంటి హక్కులు లేవని, కేవలం ధనికలకు మాత్రమే హక్కులు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా ఇదే కోరుకుంటోందని, వారు పేదలని, దళితులను, గిరిజనులను బానిసలుగా మార్చాలని భావిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Aham Brahmasmi: మరోసారి తెరపైకి అహం బ్రహ్మస్మి మోసాలు.. ఆశ్రమంలో బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తూ..
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
భారతదేశంలో ఒక వైపు రాజ్యాంగాన్ని విశ్వసించేు కాంగ్రెస్ ఉంటే, మరోవైపు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉందని అన్నారు. రాజ్యాంగం కేవలం పుస్తకం కాదని, భారతదేశ వేల ఏళ్ల ఆలోచన అని చెప్పారు. ఇందులో అంబేద్కర్, మహాత్మా గాంధీ, బుద్ధుడు, పూలే వంటి గొప్పవాళ్ల ఆలోచనలు దాగి ఉన్నట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల ముందు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ మాట్లాడిందని, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారని, కానీ కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు బీజేపీ అడ్డుకున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వల్లే ప్రధాని మోడీ లోక్సభలో రాజ్యాంగం ముందు తలవంచాల్సి వచ్చిందని చెప్పారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి పేదలు మౌనంగా ఉండాలని, ఆకలితో చనిపోవాలని భావిస్తున్నాయి, భారతదేశాన్ని కోటీశ్వరులు నడపాలని అనుకుంటున్నారని అంబానీ-అదానీలను ప్రస్తావిస్తూ ఆరోపించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!