Liquor Ban : సీఎం సంచలన నిర్ణయం.. 17 ప్రముఖ నగరాల్లో మద్యపాన నిషేధం
- మధ్యప్రదేశ్లో మద్యపాన నిషేధం
- 17 మతపరమైన పట్టణాల్లో అమలు
- ఉజ్జయినితో పాటు మరికొన్ని నగరాలు
- మహేశ్వర్లో మంత్రివర్గ సమావేశం
- మద్యం దుకాణాల శాశ్వత మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Ban : మధ్యప్రదేశ్లో మొదటి నుండి మద్యపాన నిషేధం ఒక పెద్ద సమస్యగా ఉంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు నిరంతరం మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. 2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా మద్య నిషేధ అంశం వేడెక్కింది. ఎన్నికలు జరిగిన ఒక సంవత్సరం తర్వాత ఆ రాష్ట్ర మోహన్ యాదవ్ ప్రభుత్వం శుక్రవారం నాడు రాష్ట్రంలోని 17 నగరాల్లో మొదటి దశలో మద్యాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంది.
Read Also:CM Chandrababu: ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా క్రమంగా ముందుకు సాగడానికి 17 మతపరమైన పట్టణాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తామని అన్నారు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్, మెహర్ మునిసిపాలిటీ, దాటియా, పన్నా, మాండ్లా, ముల్తాయ్, మాండ్సౌర్, ఓర్చా మున్సిపల్ కౌన్సిల్, చిత్రకూట్, అమర్కంటక్, మహేశ్వర్, ఓంకారేశ్వర్, మాండ్లేశ్వర్ వంటి నగరాల్లో మద్యం దుకాణాలు మూసివేయబడతాయని సీఎం తెలిపారు. గ్రామ పంచాయతీలో సల్కాన్పూర్, బందక్పూర్, కుందల్పూర్, బర్మాన్ కాలా, లింగా, బర్మాన్ ఖుర్ద్ ఉన్నాయి.
Read Also:Payal Rajput: పాయల్ రాజ్పుత్ ఇక పాన్ ఇండియా ‘వెంకటలచ్చిమి’
మహేశ్వర్లో జరిగిన మంత్రివర్గ సమావేశం
మోహన్ యాదవ్ మంత్రివర్గ సమావేశం మహేశ్వర్లో జరిగింది. ఈ సమావేశంలో మద్యపాన నిషేధ నిర్ణయంపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం గురించి మీడియాకు తెలియజేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించిన పట్టణాలు లేదా గ్రామ పంచాయతీలలో వాటి స్థానంలో వేరే దుకాణాలు తెరవబడవని అన్నారు. అది శాశ్వతంగా మూత పడతాయని స్పష్టం చేశారు. మద్య నిషేధం ప్రకటించిన ప్రదేశాలలో ఎక్కువ భాగం మతపరమైన ప్రదేశాలేనని ముఖ్యమంత్రి అన్నారు. నర్మదా నది ఒడ్డున ఇరువైపులా 5 కి.మీ. ప్రాంతంలో మద్యపాన నిషేధ విధానం అమల్లో ఉంది. భవిష్యత్తులో కూడా దానిని కొనసాగిస్తామన్నారు. ఈ విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. రాష్ట్రం క్రమంగా మద్యపాన నిషేధం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!