Man Shoots Daughter: పెళ్లికి 4 రోజుల ముందు కూతురిని కాల్చి చంపిన తండ్రి.. కారణం ఏంటంటే..
- పెళ్లికి నాలుగు రోజుల ముందు కూతురు హత్య..
- వివాహానికి ఒప్పుకోకపోవడంతో తండ్రి చేతిలో హతమైన కూతురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Shoots Daughter: పోలీసుల ముందే కూతురిని కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది. సదరు యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు తండ్రి చేతిలో హతమైంది. ఆమె హత్యకు కొన్ని గంటల ముందే పంచాయతీ కూడా జరిగింది. తండ్రి నిర్ణయించిన పెళ్లిని కాదని, కూతురు వేరే వ్యక్తిని విహాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ఈ హత్య జరిగింది. 20 ఏళ్ల యువతి తను గుర్జార్, తన కుటుంబం కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించింది. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. హత్యకు పాల్పడిన యువతి తండ్రిని మహేష్ గుర్జార్గా గుర్తించారు. అదే రోజు తనూ గుర్జార్ తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ వీడియోపై ఆగ్రహించిన తండ్రి, దేశీయంగా తయారు చేసిన తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. ఈ హత్యకు తను కజిన్ రాహుల్ కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
Read Also: Tummala Nageswara Rao: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల సీరియస్..
ఆమె హత్యకు కొన్ని గంటల ముందు, తన కుటుంబ సభ్యులు తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ.. 52 సెకన్ల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కుటుంబ సభ్యుల నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉందని పేర్కొంది. ‘‘నేను విక్కీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా కుటుంబం మొదట్లో అంగీకరించింది, ఆ తర్వాత నిరాకరించింది. వాళ్లు నన్ను రోజూ కొడుతూ, చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబమే బాధ్యత వహిస్తుంది’’ అని పేర్కొంది.
విక్కీ అనే వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా నివాసితో, తనూ గుర్జార్ 6 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎస్పీ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీస్ అధికారులు ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు వారి ఇంటికి చేరుకున్నారు. విషయాన్ని పరిష్కరించడానికి కుల పంచాయతీ కూడా జరిగింది. ఈ సందర్భంలోనే తను గుర్జార్ ఇంట్లో ఉండేందుకు నిరాకరించి, ప్రభుత్వం నిర్వహించే వన్ స్టాప్ సెంటర్కి తీసుకెళ్లాలని అభ్యర్థించింది.
ఆ సమయంలోనే మహేష్ కూతురితో పర్సనల్గా మాట్లాడాలని కోరాడు. ఆమెను ఒప్పిస్తానని చెప్పాడు. ఇలా నమ్మించిన మహేష్ కూతురుని దేశవాళీ తుపాకీతో కాల్చి చంపాడు. అత్యంత దగ్గర నుంచి ఛాతీ, నుదిలిపై కాల్చడంతో అక్కడిక్కడే తనూ మరణించింది. మహేష్ బంధువులు, పోలీసులపై కూడా తుపాకీతో ఫైర్ చేస్తానని బెదిరించాడు. మహేష్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, హత్యకు సహకరించిన రాహుల్ పరారయ్యాడు. జనవరి 18న జరగాల్సిన తను వివాహానికి సన్నాహాలు జరుగుతుండగా ఈ హత్య జరిగింది.
తాజావార్తలు
-
Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
-
Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు – బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
-
Ajinkya Rahane: “మా విజయ రహస్యం ఇదే”.. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
-
Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Summer Special Cooling Tea Recipe: మీ శరీరాన్ని టీ కూల్ చేస్తుంది.. ఈ మూడు కలిపితే చాలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!