వరుస ఓటములతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ తప్పుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య దేశం వరుస ఓటములతో ఈ పోటీ నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్ గెలిచిన ఇండియా సెమీఫైనల్ చేరింది. ఓడిన పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔటైంది. చివరిసారి 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు టీమ్సే తలపడ్డాయి. అందులో ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఓ ఐసీసీ టోర్నీలో ఇండియాను పాక్ ఓడించడం అదే తొలిసారి. ఇప్పుడు…
భారత్ పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. 2 వికెట్ల నష్టానికి వద్ద పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో విరాట్, శ్రేయస్ అయ్యారు ఇద్దరూ నిలకడగా ఆడటం కలిసొచ్చింది. విరాట్ సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయస్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ను భారత్ 241 పరుగులకు ఆలౌట్ చేసింది.
నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాకిస్థాన్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి పాకిస్థాన్ 241 పరుగుల వద్ద కుప్పకూలింది. హర్షిత్ రాణా వేసిన 49.4 ఓవర్కు ఖుష్దిల్ షా (38) ఔటయ్యాడు. దీంతో పాక్ 241 పరుగులకు ఆలౌటైంది.
నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాకిస్థాన్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ 241కి ఆలౌట్ అయ్యింది. తొలుత పాకిస్థాన్ 47 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (47), సౌద్ షకీల్ (62) 104 పరుగులు జోడించారు.
సీఎంలు అనుకూలంగా మాట్లాడే టీచర్లు ఎమ్మెల్సీలు అయ్యారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.. తెలంగాణలో పాత పీఆర్సీ దిక్కులేదని చెప్పారు. ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యాక రెండు మూడు ఏళ్లు గడిచిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందన్నారు. దానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి కారణమని స్పష్టం చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి పిల్ దాఖలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. కేటీఆర్ దీనిపై స్పందించి కేసీఆర్ బదులు వేరే వాళ్ళను అక్కడ పోటీ చేయించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేయాలని కానీ అసెంబ్లీకే రాకుంటే అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్లో తెలిపారు.
సంగారెడ్డి (మం) ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట అడుకుంటుండగా చాక్లెట్ కొనిస్తామని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. చిన్నారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకువెళ్లే విజువల్స్ రికార్డు అయ్యాయి.
వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్నాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు. పోలేపల్లి లో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత నారాయణపేట మండలం అప్పక్ పల్లి చేరుకుంటారు.
గతంలో అబ్బాయికి 21, అమ్మాయికి 18 వచ్చిందంటే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడు 30 ఏళ్లు దాటిన అమ్మాయిలు, 35 దాటిన అబ్బాయిల సంఖ్య పెరుగుతోంది. గతంలో పెళ్లిళ్లకు కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. పెళ్లిళ్లలోనే అమ్మాయిని చూసి, పెళ్లి విషయాలు మాట్లాడుకుని వివాహాలు జరిపించేవారు. కానీ నేడు పెళ్లళ్లకు ఇంటికొకరు మాత్రమే హడావుడిగా రిసెప్షన్కు వచ్చి వెళ్లిపోతున్నారు.
ఇండియాస్ గాట్ లాటెంట్ కార్యక్రమంలో చెలరేగిన వివాదం మధ్య, కేంద్రం ఓటీటీ ప్లాట్ఫామ్లకు కీలక సూచనలు చేసింది. ప్లాట్ఫామ్స్ ప్రవర్తనా నియమావళిని పాటించాలని కేంద్రం సూచించింది. ‘A’ రేటెడ్ కంటెంట్ను నిషేధించాలని తెలిపింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఓటీటీ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్లపై ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఐటీ రూల్స్లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి ప్రస్తావించింది. సామాజిక మాధ్యమాలు,…