IND vs PAK: సెంచరీతో మెరిసిన విరాట్.. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం..
- భారత్ పాకిస్థాన్పై ఘన విజయం
- సెంచరీ పూర్తి చేసిన విరాట్
- 42.3 ఓవర్ల వద్ద 244/4 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. 4 వికెట్ల నష్టానికి వద్ద పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. 42.3 ఓవర్కు ఫోర్ బాదిడంతో సెంచరీతో పాటు భారత్ ఘన విజయం సాధించింది. భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విరాట్, శ్రేయస్ అయ్యారు ఇద్దరూ నిలకడగా ఆడటం కలిసొచ్చింది. విరాట్ సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయస్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ను భారత్ 241 పరుగులకు ఆలౌట్ చేసింది. దీని తర్వాత.. టీం ఇండియా బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా వచ్చారు. షహీన్ షా అఫ్రిది తొలి ఓవర్ వేశాడు. కాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (20; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. షహీన్ షా అఫ్రిది వేసిన ఐదో ఓవర్లో ఐదో బంతికి ఫోర్ బాదిన రోహిత్.. చివరి బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు. అనంతరం శుభ్మన్ గిల్ దూకుడుగా ఆడాడు.
READ MORE: AP: గంజాయి మత్తులో యువకుల వీరంగం.. హోటల్ నిర్వాహకుడిపై దాడి
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
విరాట్ కోహ్లీ క్రీజ్లోకి వచ్చాడు. సమయంలో, విరాట్ కోహ్లీ కూడా తన వన్డే కెరీర్లో 14 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు. అంతలో అబ్రార్ అహ్మద్ వేసిన 17.3 ఓవర్కు శుభ్మన్ గిల్ (46) క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో 100 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. గిల్ పెవిలియన్కు చేరుకోగానే శ్రేయస్ అయ్యార్ బరిలోకి దిగాడు. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ చాకచక్యంగా ముందుకు సాగారు. విరాట్ కోహ్లీ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నసీమ్ షా వేసిన 26.1 ఓవర్కు బౌండరీ బాది అర్ధ శతకం అందుకున్నాడు. అబ్రార్ అహ్మద్ వేసిన 37 ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసి శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఖుల్దిష్ షా వేసిన 38.5 ఓవర్కు శ్రేయస్ అయ్యర్ (56) ఔటయ్యాడు. ఇమామ్ ఉల్ హక్కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. షహీన్ షా అఫ్రిది వేసిన 40 ఓవర్లో చివరి బంతికి హార్దిక్ పాండ్య (8) రిజ్వాన్కు క్యాచ్ ఇచ్చాడు. షహీన్ షా వేసిన 42 ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..