Home
Latest Telugu News
Latest Telugu News News
-
నిన్న వరుడు అలా.. నేడు వధువు ఇలా…
వివాహం జరిగి 24 గంటలు కాకముందే ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. భర్తతో కలిసి పుట్టింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం నాడు వరుడు మృతి చెందగా.. గురువారం నాడు వధువు ప్రాణం కోల్పోయింది. దీంతో పెళ్లి జరిగిన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. వివరాల్లో వెళ్తే… హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో తమిళనాడు రాష్ట్రానికి చెందిన కనిమొళికి ఇటీవల తిరుపతిలో అంగరంగ వైభవంగా పెద్దల… -
‘ఆది’ రేంజ్లో వస్తాడనుకున్నాం.. కానీ ప్రవచనం చెప్పినట్టుంది
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొన్నిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై హీరో జూ.ఎన్టీఆర్ కూడా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు అర్థవంతంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదని చెప్తూ ఓ వీడియో విడుదల చేశాడు. అయితే జూ.ఎన్టీఆర్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. Read Also: కాస్ట్ విషయంలో క్లారిటీ లేని నేత ఎవరు..? కొడాలి నాని, వల్లభనేని… -
ఇంగ్లీష్ మాట్లాడుతున్న మహిళా బెగ్గర్… ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు
వారణాసిలోని వీధుల్లో అడుక్కుంటున్న ఓ మహిళ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతోంది. ఆమె పేరు స్వాతి. ఓ వ్యక్తి రోడ్డుపై ఉన్న దుకాణం వద్ద టిఫిన్ చేస్తూ స్వాతి ఇంగ్లీష్ మాట్లాడటాన్ని గుర్తించాడు. దీంతో అతడు స్వాతి గురించి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. దీంతో అతడు స్వాతిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్గా మారింది. ఫేస్బుక్లో ఈ వీడియోలను 78వేల మంది వీక్షించారు. స్వాతి సైన్స్ గ్రాడ్యుయేట్… -
కంగనా రనౌత్కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు
సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఆప్ నేత రాఘవ చద్దా ప్యానెల్ ముందు డిసెంబర్ 6న హాజరుకావాలని ఆదేశించింది. కంగనా చేసిన వ్యాఖ్యలతో సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ కమిటీ ఆరోపించింది. Read Also: ‘అఖండ’ ప్లాన్ రివర్స్… బాలయ్యే కారణం అంటున్న నిర్మాత ఇటీవల సాగు చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు… -
రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది ప్రారంభంలో జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్తో తిరిగి జట్టులోకి పునరాగమనం చేసిన అతడు.. ఎక్కువకాలం టెస్టుల్లో కొనసాగేందుకు సిద్ధంగా లేనని ఆ సమయంలోనే బోర్డుకు సూచించాడు. దీంతో పాకిస్థాన్తో టెస్టు సిరీస్కు ముందు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్లో 50 టెస్టులు ఆడిన మహ్మదుల్లా 33.11… -
వైసీపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా రేపు వర్లరామయ్య దీక్ష
టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొద్దిరోజులుగా టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సహా పలువురు ప్రముఖులు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. మరోవైపు భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య దంపతులు గురువారం నాడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. Read Also: చంద్రబాబుకు నమస్కారం చేసిన వైసీపీ… -
ఆప్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనకు 100 రోజులు
ఆప్ఘనిస్తాన్లో తాలిబన్లు పాలన ప్రారంభించి 100 రోజులు పూర్తయింది. అమెరికా బలగాలు ఆప్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు అక్కడి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తమ చేతుల్లో తీసుకుని పాలించడం మొదలుపెట్టారు. తాలిబన్లు అధికారంలోకి రావడంతో అఫ్ఘనిస్తాన్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా మహిళల హక్కులను తాలిబన్లు హరించివేస్తున్నారనే అపవాదు వచ్చింది. మీడియాపైనా తాలిబన్లు పలు రకాల ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పలువురు పౌరులు దేశాన్ని విడిచి… -
కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. రోడ్లు కత్రినా బుగ్గల్లా ఉండాలంటూ వ్యాఖ్య
ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. మరి వారు బాధ్యతను మరిచి వివాదాల జోలికి వెళ్తున్నారా… లేదంటే తాము లైమ్లైట్లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా అనే విషయం దేవుడికే తెలియాలి. తాజాగా రాజస్థాన్కు చెందిన ఓ మంత్రి, కాంగ్రెస్ నేత రోడ్లను ఓ బాలీవుడ్ హీరోయిన్తో పోల్చారు. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్ రెండు రోజుల కిందట క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేశారు. ఈ సందర్భంగా… -
ఏపీలో భారీగా వరద నష్టం.. ప్రాథమిక అంచనా ఎంతంటే..?
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలలో వరదలు ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో భారీ స్థాయిలో వరద నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ప్రస్తుతం వరద కొంచెం తగ్గుముఖం పట్టడంతో అధికారులు వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వరదల వల్ల మొత్తం రూ. 6,054 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. Read Also: ఈ… -
ఐసీసీ టీ20 ర్యాంకులు.. భారత్ నుంచి ఒకేఒక్కడు
టీ20 ర్యాంకింగ్స్ను బుధవారం నాడు ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒకే ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆ ఆటగాడే కేఎల్ రాహుల్. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో ఓపెనర్గా కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. దీంతో అతడు 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 809 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 805 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ రెండో…
తాజావార్తలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
-
NBK 111 : రొమాంటిక్ సింహం.. బాలయ్యతో బాలీవుడ్ హీరోయిన్ ఐటం సాంగ్
-
TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!