తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది జరిమానాల రూపంలో ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఏడాదిలో ఇప్పటిరకు రూ.533కోట్ల జరిమనాను పోలీసులు విధించారు. అంటే రోజుకు రూ. కోటిన్నర చొప్పున వసూలు చేశారు. Read Also: అంకుల్ అని పిలిచిన యువతి.. కోపంతో ఆ వ్యక్తి చేసిన పనికి… అయితే ట్రాఫిక్ ఛలానాలలో ఎక్కువగా హెల్మెట్ ధరించనందుకు విధించిన జరిమానాలే ఉన్నాయి. హెల్మెట్లు…
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా అయితే కనిపించడంలేదు. టిక్కెట్ల రేట్ల కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో థియేటర్లు మూతపడ్డాయి. సౌతిండియాలో అతిపెద్ద స్క్రీన్ కూడా మూతపడింది. ఈ ఇష్యూపై ఇటీవల హీరో నాని సంచలన కామెంట్స్ చేయగా తాజాగా హీరో నిఖిల్ స్పందించాడు. ఏపీలో థియేటర్లు మూతపడటం చాలా బాధాకరమన్నాడు. ఏపీలో చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టిక్కెట్ రేటు రూ.20గా ఉందని.. రైలులో కంపార్టుమెంట్ల ఆధారంలో ప్రీమియం లేదా…
కృష్ణా జిల్లా గుడివాడలో ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది. మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, టీడీపీ నేత వంగవీటి రాధాలు ఒకేచోట కలుసుకున్నారు. గుడివాడలోని కొండాలమ్మ గుడి వీరి కలయికకు కారణమైంది. ఈ ముగ్గురూ కృష్ణా జిల్లాలో పేరున్న పొలిటికల్ లీడర్స్ కావడం విశేషం. అంతకుముందు గుడివాడలో వంగవీటి రంగా విగ్రహ ప్రారంభోత్సవానికి వంగవీటి రాధా వెళ్లారు. అనంతరం వల్లభనేని వంశీ, వంగవీటి రాధా కొండాలమ్మ గుడికి వెళ్లగా… రాధాతో పాటు…
గత 2 సంవత్సరాలుగా అగ్రదేశమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో భయాందోళన సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తి తగ్గడం లేదు. కరోనా కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలు విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో ఇప్పడు మరోసారి ప్రపంచ దేశాలు సైతం భయాందోళన చెందుతున్నాయి. అయితే తాజాగా ఇండియాలో 6,987 కరోనా కేసులు రాగా, 162 మంది కరోనా సోకి మరణించారు. అయితే ప్రస్తుతం 76,766 కరోనా కేసులు…
విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ నటుడి అవతారం ఎత్తారు. ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ పథకంపై ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఉపాధ్యాయుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీకి త్రినాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. Read Also: ఒమిక్రాన్కు మందు…
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించింది. గయానా నుంచి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్-5 రాకెట్ ద్వారా నింగిలోకి అతిపెద్ద వెబ్ స్పేస్ టెలీస్కోప్ను విజయవంతంగా నాసా సైంటిస్టులు ప్రవేశపెట్టారు. దీని ద్వారా విశ్వం పుట్టుక తొలినాళ్లలో ఏర్పడిన గెలాక్సీలను వెబ్ స్పేస్ టెలీస్కోప్ పరిశోధనలు జరపనుంది. ఓ రకంగా ఇది గత కాలానికి చెందిన ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మెషీన్లాంటిది. 21 అడుగుల పొడవైన వెబ్ స్పేస్…
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుంది. ఈ సందర్భంగా సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గార్ మాట్లాడుతూ… పేపర్ మీద టీమిండియా జట్టు బలంగా కనిపిస్తున్నా గెలుపు మాత్రం తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. హోం గ్రౌండ్లో పరిస్థితులు తమకే అనుకూలంగా ఉంటాయని ఎల్గార్ తెలిపాడు. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో టీమిండియా మంచి ఆటతీరును కనిపరిచిందని.. అందుకే తాము…
కరోనాకు మందు తయారుచేసి సంచలనం సృష్టించిన ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తాజాగా ఒమిక్రాన్ వేరియంట్కు కూడా మందు తయారు చేశారు. సుమారు 22 రకాల దినుసులతో ఈ మందును తయారుచేసినట్లు ఆనందయ్య వెల్లడించారు. ఒమిక్రాన్ సోకకుండా అందరూ ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ మాదిరి ఈ మందును వేసుకోవాలని ఆనందయ్య సూచించారు. ఈ మందును ఒకేరోజు రెండు పూటలా తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ మేరకు ఒమిక్రాన్ మందును పంపిణీ చేస్తున్నట్లు ఆనందయ్య పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వారు…
క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ కూడా సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా వేర్వేరు సంవత్సరాల్లో తాను క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ఫోటోలను కూడా సచిన్ షేర్ చేశాడు. ఇందులోని ఓ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్య గెటప్లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్యగా ఓ బాలికతో సందడి చేస్తున్నట్లు ఉంది. ఈ ఫోటో 2018లో తీసినట్లు సచిన్…
ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ నోవోటెల్ హోటల్లో తన భార్య భారతితో కలిసి జగన్ సీజేఐను కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి సీజేఐతో జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతకుముందు క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పర్యటనకు కడప జిల్లా వెళ్లిన జగన్ ఈరోజు మధ్యాహ్నమే విజయవాడకు చేరుకున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ…