సంగారెడ్డి జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం నెలకొంది. జహీరాబాద్ మండలం డిడ్గి వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు అమాంతం అదుపుతప్పి బైక్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న దంపతులతో సహా 8 ఏళ్ల చిన్నారి మృతి చెందారు. వీరితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతులను…
కొత్త సంవత్సరం సందర్భంగా తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించినా మందుబాబులు మాత్రం పెడచెవిన పెట్టారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ 50 మంది పట్టుబడ్డారు. 40 బైక్లు, ఏడు కార్లు, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. Read Also: హైదరాబాద్లో మరో భారీ…
దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి. ఐజీఎస్టీలో దిగుమతిపై వచ్చిన రూ.37,527 కోట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సెస్ రూపంలో రూ.9,389 కోట్లు వసూలయ్యాయి. Read…
బిగ్బాస్ సీజన్ 5 రన్నరప్గా నిలిచిన షణ్ముఖ్ జశ్వంత్తో బ్రేకప్ అవుతున్నట్లు న్యూఇయర్ రోజు దీప్తి సునయన ప్రకటించడంతో షన్నూ అభిమానులు షాక్ తిన్నారు. తమ ఐదేళ్ల బంధానికి ముగింపు పలుకున్నట్లు దీప్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రేకప్పై షణ్ముఖ్ స్పందించాడు. దీప్తికి బ్రేకప్ నిర్ణయం తీసుకోవడానికి అన్ని హక్కులు ఉన్నాయని షన్నూ స్పష్టం చేశాడు. దీప్తి తన వల్ల ఇప్పటివరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. ఆమె సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు…
ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్లతో క్రేజ్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్ కొత్తగా క్రీడాభిమానులకు గాలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ ప్రైమ్లో తొలిసారిగా క్రికెట్ లైవ్ ప్రారంభమైంది. శనివారం నాడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆట అమెజాన్ ప్రైమ్లో లైవ్ స్ట్రీమ్ అయ్యింది. దీంతో క్రికెట్ అభిమానులు టీవీ ఛానళ్ల జోలికి వెళ్లకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా క్రికెట్ను వీక్షిస్తున్నారు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ…
హైదరాబాద్ నగరంలో మరోసారి మందుబాబులు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో మరొకరు బలయ్యారు. గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ ముందు జరిగిన రోడ్డుప్రమాదంలో ఐటీ ఉద్యోగి నితిన్ మృతి చెందాడు. ఈరోజు తెల్లవారుజామున సైకిల్ తొక్కేందుకు నితిన్ బయటకు వచ్చిన సమయంలో మద్యం మత్తులో కారుతో వెనుక నుంచి శశాంక్ అనే వ్యక్తి ఢీ కొట్టాడు. Read Also: తెలంగాణలో మద్యం అమ్మకాలు.. సరికొత్త రికార్డు ఈ ప్రమాదంలో నితిన్కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా……
ఏపీలో పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుకను ప్రభుత్వం అందించనుంది. జనవరి 1 నుంచి పెంచిన రూ.250 పెన్షన్ను లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఒక్కొక్కరికి రూ.2,500 పెన్షన్ అందనుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో సీఎం జగన్ ఈ పెంచిన పెన్షన్ కానుకమొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. Read Also: నూతనం.. ప్రారంభం.. ఆరంభం.. అంటూ పవన్ కళ్యాణ్ విషెస్ కాగా జనవరి 1 నుంచి ఐదు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా…
మరికొద్ది గంటల్లో మనమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నూతనం… ప్రారంభం.. ఆరంభం.. అనే పదాలలోనే ఒక ఉత్తేజం నిండి ఉంటుందని… అటువంటిది కొత్త సంవత్సరం ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలివస్తుందని పవన్ పేర్కొన్నారు. ఇటువంటి 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారందరితో…
దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటిస్తోంది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్లో పాల్గొంటున్న జట్టు ఆ తర్వాత మూడు వన్డేలను ఆడనుంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు సెలక్టర్లు భారత జట్టును శుక్రవారం రాత్రి ప్రకటించారు. ఈ వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. గాయం కారణంగా రోహిత్ దూరం కావడంతో కేఎల్ రాహుల్కు వన్డే పగ్గాలను అప్పగించారు. బుమ్రాను వైస్ కెప్టెన్గా నియమించారు. భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్,…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ నుంచి అనేక కొత్త వేరియంట్లు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా ఫ్లోరోనా వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్లో తొలి ఫ్లోరోనా కేసు నమోదైంది. Read Also: భర్త ఆ పని చేయలేదని అర్ధరాత్రి దారుణానికి ఒడిగట్టిన భార్య ఫ్లోరోనా అంటే కోవిడ్-19 అని.. ఇది డబుల్ ఇన్ఫెక్షన్…