ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతుండగా… ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, పార్కులు మూసివేస్తున్నట్లు తెలిపింది. Read Also: కలవరపెడుతున్న ఒమిక్రాన్… తెలంగాణలో 84కి చేరిన కేసులు మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ,…
కరోనా సమయంలో రైళ్ల కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలోనూ ఇండియన్ రైల్వేకు భారీ ఆదాయం సమకూరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తత్కాల్, ప్రీమియం టికెట్ల విక్రయాల ద్వారా రైల్వేకు రూ.500 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఏడాదిలో తత్కాల్ టికెట్ల ద్వారా రూ.403 కోట్లు, ప్రీమియం తత్కాల్ టికెట్ల ద్వారా రూ.119 కోట్ల ఆదాయాన్ని రైల్వేశాఖ ఆర్జించింది. Read Also: వైరల్: బైకుపై హీరో లెవల్లో గన్తో… కట్ చేస్తే…!…
అర్జెంటీనాకు చెందిన పుట్బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ కరోనా బారిన పడ్డాడు. మెస్సీతో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లకు కూడా కరోనా సోకినట్లు సమాచారం అందుతోంది. జర్మన్ క్లబ్ పీఎస్జీ తరఫున ఆడుతున్న మెస్సీ ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న ఫ్రెంచ్ కప్లో ఆడుతున్నాడు. సోమవారం వాన్నెస్ జట్టుతో పీఎస్జీ జట్టు తలపడాల్సి ఉంది. అయితే మెస్సీ కరోనా వైరస్ బారిన పడటంతో ఆ జట్టు ఆందోళనకు గురవుతోంది. ప్రస్తుతం మెస్సీ సెల్ఫ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నాడు.…
సోషల్ మీడియాలో ఇద్దరు యువకుల వీడియో తెగ వైరల్ అవుతోంది. సదరు వీడియోలో ఇద్దరు యువకులు రాయల్ ఎన్ఫీల్డ్ బైకుపై వెళ్తూ హీరో లెవల్లో విన్యాసాలు చేశారు. ఒక యువకుడు బైకు నడుపుతుంటే… మరో యువకుడు అతడి భుజంపై కూర్చుని ఒక చేత్తో సిగరెట్, మరో చేత్తో తుపాకీ పట్టుకుని రాయల్గా కనిపించాడు. అయితే వీరు ఈ విధంగా బైకు నడుపుతున్న ఫోటోను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాయక్ నహీ.. ఖల్…
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడులో టీడీపీ కార్యకర్తలతో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ… కేఈ కృష్ణమూర్తి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని… పగతో రగిలిపోతోందని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. అయితే తమపై వైసీపీ ఎంత కసి పెంచుకున్నా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని కేఈ స్పష్టం చేశారు. Read Also: 10 రూపాయల కోడి పిల్లకి.. రూ.50…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాను టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేస్తున్నారని ఇటీవల కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సదరు ఛానళ్లు రేవంత్రెడ్డికి అభిమానులుగా పనిచేస్తున్నాయని… రేవంత్కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకముందు మూడేళ్ల కిందటి నుంచే రాజు వస్తున్నాడంటూ తెగ హడావిడి చేసినట్లు గుర్తుచేశారు. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నానని… కేటీఆర్ ఎదురుపడితే పలకరించానని జగ్గారెడ్డి తెలిపారు.…
విజయవాడ సిటీ బీజేపీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బీజేపీ నేతలు ఆడ, మగ తేడా లేకుండా ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ సినిమా పాటకు చిందులేశారు. వారి వెనుక వైపు ప్రధాని మోదీ, జేపీ నడ్డా, సోము వీర్రాజులతో కూడిన ఫ్లెక్సీ ఉండగా.. ఆ వేదిక పైనే బీజేపీ నేతలు డ్యాన్సులు వేశారు. Read Also: దేశంలోనే బెస్ట్ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అయితే ఇటీవలే…
తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు భక్తులకు వైకుంఠద్వార దర్శనం ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వైకుంఠద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా తిరుమల వచ్చిన వీఐపీలకే దర్శనం కల్పిస్తామన్నారు. చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదన్నారు. Read Also: దేశంలోనే బెస్ట్ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తిరుమలలో గదుల మరమ్మతుల కారణంగా ఏకాదశి…
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దేశంలోనే బెస్ట్ డీజీపీగా నిలిచారు. ఆయన ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గానూ అత్యుత్తమ డీజీపీగా ప్రకటిస్తున్నట్లు ది బెటర్ ఇండియా సంస్థ తెలిపింది. 2021 సంవత్సరానికి దేశంలో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను ది బెటర్ ఇండియా సంస్థ విడుదల చేసింది. గత రెండేళ్లలో కరోనా కారణంగా ఎదురైన అనేక కఠినమైన సవాళ్లను డీజీపీ సవాంగ్ ఎదుర్కొన్నట్లు ఆ సంస్థ పేర్కొంది.…
హైదరాబాద్ ఖాజాగూడలోని కరాచీ బేకరీపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. కరాచీ బేకరీలో కొన్న స్వీట్లలో బూజు ఉందంటూ ఓ వ్యక్తి తెలంగాణ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన ఆయన… వెంటనే కరాచీ బేకరీపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాడు. ఈ క్రమంలో ఖాజాగూడలోని కరాచీ బేకరీలో అధికారులు సోదాలు నిర్వహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బేకరీ పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. బేకరీలోని…