ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను కచ్చితంగా నిర్వహించి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ రెండో వారం నుంచి నిర్వహించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షల షెడ్యూల్ను నేడు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మార్చిలోగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని సమాచారం. అలాగే ప్రీఫైనల్ పరీక్షలను ఈనెల 21 నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించాలని…
★ నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన… శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్★ నేడు, రేపు తిరుమలలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన… సాయంత్రం తిరుమల చేరుకోనున్న వెంకయ్యనాయుడు.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ఉపరాష్ట్రపతి★ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని నేడు విజయవాడ ధర్నా చౌక్లో టీడీపీ నేత బోండా ఉమా దీక్ష.. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్న బోండా ఉమా★ రాష్ట్ర విభజన అంశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై…
ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం సీఎం జగన్కు లేఖ రాశారు. ఉద్యోగుల ఆవేదనను మీ దృష్టికి తీసుకురావడంలో పీఆర్సీ సాధన సమితి నేతలు విఫలం అయ్యారు. కాబట్టి ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో లోటుపాట్లను గుర్తించాలని.. ఈ విషయంలో పునరాలోచించి ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై దృష్టిపెట్టాలని లేఖలో కోరారు. మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే హెచ్ఆర్ఏను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Read Also: ఎర్రజెండా వెనుక పచ్చజెండా…
వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో వ్యక్తిగత కారణాలతో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ పాల్గొనలేదు. అయితే రెండో వన్డే కోసం అతడు జట్టుతో చేరిపోయాడు. ఈ మేరకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కేఎల్ రాహుల్తో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, కరోనా నుంచి కోలుకున్న బౌలర్ నవదీప్ సైనీ కూడా జట్టుతో చేరారు. దీంతో బుధవారం జరగనున్న రెండో వన్డేలో టీమిండియా తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. Read Also: పలు ఫ్రాంచైజీలు సంప్రదించాయి..…
కర్ణాటకలో హిజాబ్ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పలు ప్రాంతాల్లో ముస్లిం విద్యార్థినులు తల, మెడను కప్పి వుంచే స్కార్ఫ్ ధరించి క్లాసులకు హాజరవుతున్నారు. దీనినే హిజాబ్ అంటారు. అయితే హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను కాలేజీల్లోకి అనుమతించడం లేదు. దీనిని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. కాలేజీలో చేరినప్పుడే తమకు ఈ విషయాలు చెప్పి ఉండాల్సిందని.. కానీ చెప్పకుండా ఇప్పుడు అనుమతించకపోవడం సరికాదని విద్యార్థులు మండిపడుతున్నారు. నిరసనలు వ్యక్తం చేసినా ప్రయోజనం లేకపోవడంతో క్లాసులకు హాజరుకాకుండా నిరాశగా వెనుతిరుగుతున్నారు.…
ప్రస్తుతం ఇంటర్నెట్ వాడాలంటే బ్రౌజర్గా గూగుల్ క్రోమ్ను ఎక్కువగా వాడుతున్నారు. ప్రపంచంలో 63 శాతం మంది గూగుల్ క్రోమ్ వాడుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో స్పష్టమైంది. అయితే గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చింది. దీంతో సైబర్ భద్రతకు ముప్పు ఎక్కువగా ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇన్) హెచ్చరించింది. దీనికి సంబంధించి ఓ నివేదికను కేంద్ర ప్రభుత్వ సంస్థ…
జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కొందరు కోర్టుకు వెళ్లారని.. పేదలకు ఇళ్లు రాకుండా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కామ్రేడ్లు మద్దతిస్తున్నారని జగన్ ఆరోపించారు. అయితే ఎర్రజెండా వెనుక పచ్చజెండా అజెండా ఉందని జగన్ విమర్శించారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు అని.. కానీ చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే సమ్మెలు, ఆందోళనలు చేయడం…
ప్రధాని మోదీ వరుసగా మూడో ఏడాది కూడా ప్రపంచ నంబర్ వన్ నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత పాపులారిటీ ఉన్న నేతగా మోదీ నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను అధిగమించి మరోసారి మోదీ టాప్ ప్లేస్ కొట్టేశారు. సర్వేలో మొత్తం 72 శాతం మంది మోదీకి పట్టం కట్టారు. ఈ జాబితాలో మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ ఉన్నారు. ఆయనకు…
ఏపీలో జగనన్న చేదోడు పథకం రెండో ఏడాది నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నిధులను లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ పథకంలో భాగంగా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10వేల ఆర్థిక సహాయం అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,350 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు రూ.285.35 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. Read Also: మహేష్బాబుతో…
నేటి కాలంలో పెళ్ళిళ్లు కళ్లు చెదిరేలా జరుగుతున్నాయి. అయితే కరోనా పరిస్థితుల వల్ల వివాహాలు వినూత్నంగా వర్చువల్ పద్ధతిలో చేయడం చూస్తున్నాం. ఈ కోవలోకే మరో వివాహ వేడుక చేరింది. కోవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యతోనే తమిళనాడుకు చెందిన ఓ జంట వివాహం చేసుకుంది. కానీ మ్యారేజ్ రిసెప్షన్ని మాత్రం మెటావర్స్ టెక్నాలజీ సహాయంతో అంగరంగ వైభవంగా జరుపుకుంది. మెటావర్స్ టెక్నాలజీతో ఆసియా ఖండంలో జరిగిన తొలి వెడ్డింగ్ రిసెప్షన్ ఇదే కావడం విశేషం. శివలింగపురం…