Home
Latest Telugu News
Latest Telugu News News
-
PM Modi : శభాష్.. బండి సంజయ్.. కష్టపడి పని చేస్తున్నారు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రకు శనివారం ముగింపు సభ నిర్వహించారు. అయితే ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి హజరై ప్రసంగించారు. ఇదిలా ఉంటే.. నేడు ఇటీవల పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గ మధ్యలో బండి సంజయ్ కు ప్రధానమంత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. శభాష్ బండి సంజయ్.. కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు… -
Minister KTR : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా..
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా అమిత్షా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు మీడియా సమావేశం నిర్వహించి అమిత్ షా వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ పర్యాటకుల సందడి నడుస్తోందని ఆయన సెటైర్లు వేశారు. అంతేకాకుండా… గాలి మోటర్లో వచ్చి.. గాలి… -
NTV Specials : మూడోసారీ మోడీయే ప్రధాని..!
ప్రధాని నరేంద్ర మోడీ తాను మూడోసారి ప్రధాని కావటంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మూడవసారి ఏం ఖర్మ..ఎన్నిసార్లయినా కావచ్చు అనేలా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. ప్రధాని మోడీ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం పొందుతున్న వృద్ధులు.. వితంతువులు ..పేద ప్రజలతో మోడీ రెండు రోజుల క్రితం వర్చువల్ గా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత ఒకరు తనను కలిసి మోడీజీ..… -
NTV Specials : ఒమిక్రాన్ వలయంలో చిక్కుకున్న కిమ్..!
రెండేళ్లుగా కరోనా నుంచి బారినపడకుండా తనను తాను రక్షించుకున్న ఉత్తర కొరియాలో ప్రస్తుతం మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది. గురువారం రాజధాని ప్యోంగాంగ్లో తొలి కేసు వెలుగు చూసింది. అప్పటి వనుంచి మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 42 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఆదివారం ఉత్తర కొరియా అధికార మీడియీ కరోనా వ్యాప్తికి సంబంధించి అనేక విషయాలు వెల్లడించింది. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయిలో వేగంగా విస్తరిస్తోంది. కేవలం… -
Amit Shah : దళితులకు 3 ఎకరాలు అన్నారు.. 3 అంగుళాల కూడా ఇవ్వలేదు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ నిజాంను తరిమి కొట్టాలని, కూకటి వేళ్ళ నుంచి టీఆర్ఎస్ను పెకిలించడమం కోసమే బండి సంజయ్ యాత్ర అని ఆయన వెల్లడించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు, దాశరథికి నా నివాళులని, భగభగ మండే నడి… -
Weather Update : హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం..
భానుడి భగభగకు హైదరాబాద్ వాసులు ఉక్కపోతతో సతమతమవుతున్న వేళ… వరుణుడు కరుణించాడు.. హైదరాబాద్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో.. నగరంలోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై మ్యాన్హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులు జలమయమవడంతో.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం… -
Illegal Affair : ప్రియుడి మోజులో.. కట్టుకున్నోడిని కడతేర్చిన భార్య..
రోజురోజు బంధాలు, బాంధవ్వాలంటే ఎవ్వరికీ లెక్కలేకుండా పోతోంది. నిండినూరేళ్లు కట్టుకున్న వాడితో ఉంటానని ప్రమాణం చేసిన ఓ భార్య.. వివాహేతర సంబంధం మోజు పడి.. భర్తనే కాటికి పంపింది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం పగిడిమర్రి గ్రామంలో గత నెల 22న యూనుస్ (34) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే.. యూనుస్ తండ్రి ఇమాసాబ్ కొడుకు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో… -
Errabelli Dayakar Rao : కూట్లో రాయి తీయనోడు, ఏట్లో రాయి తీస్తాడా?
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు పాలకుర్తి నియోజకవర్గములో సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్లు తదితర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కిరికిరి చేష్టలు, బోగస్ మాటలు, కల్లబొల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ 50 ఏళ్లు దేశాన్ని పాలించిందని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ చేసింది ఏమీ లేదని,… -
Amit Shah : హైదరాబాద్కు చేరుకున్న అమిత్ షా
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్కు చేరుకున్న అమిత్ షాకు 20 మంది బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కొత్తగా సీఎఫ్ఎస్ఎల్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన నేషనల్ సైబర్… -
Mother and Son Suicide Case : కామారెడ్డి ఘటనలో.. నిందితులకు బెయిల్..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కామారెడ్డి తల్లి కొడుకుల ఆత్మహత్య కేసులో నిందుతులకు బెయిల్ మంజురైంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొందరు వ్యక్తుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సంతోష్, అతడి తల్లి పద్మ కామారెడ్డిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. 18 నెలలుగా 7గురు వ్యక్తులు తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పిన సంతోష్..వారి పేర్లను కూడా వెల్లడించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసును…
తాజావార్తలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!