Viacom 18: పురుషుల క్రికెట్ తరహాలో మహిళా క్రికెట్కు కూడా ఆదరణ పెంచాలని బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల ఐపీఎల్ ప్రసార హక్కులకు భారీ ధర లభించింది. మహిళల ఐపీఎల్కు సంబంధించి వచ్చే ఐదేళ్ల కాలానికి మీడియా రైట్స్ను రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రూ.951 కోట్లతో వయాకామ్ 18 సంస్థ బిడ్డింగ్ వేసింది. అంటే ఒక మ్యాచ్కు…
Axar Patel: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 31 బంతుల్లో అతడు 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తన తొలి అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. దీంతో భారత్ తరఫున ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా అక్షర్ పటేల్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏడో స్థానంలో బరిలోకి దిగి 65 పరుగులు ఎవరూ చేయలేదు.…
IND Vs SL: ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ అద్భుత విజయం సాధించింది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను చివరకు 160 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బంతిని అక్షర్ పటేల్ చేతికి ఇచ్చాడు. అతడు ఈ ఓవర్లో 10 పరుగులు ఇచ్చి రెండు రనౌట్లు చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. దీంతో రెండు పరుగుల…
IND Vs SL: ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా యువ క్రికెటర్లు అంచనాల మేర రాణించలేకపోయారు. తొలి టీ20 ఆడుతున్న గిల్, ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కేవలం 7 పరుగులకే అవుటయ్యారు. అటు తుదిజట్టులో అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ కూడా రాణించలేకపోయాడు. కేవలం 5 పరుగులు చేసి మాత్రమే శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా…
Team India: శ్రీలంకతో వన్డే సిరీస్కు టీమిండియాలో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడంతో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్లను ఎంపిక చేయగా ఇప్పుడు వీరితో బుమ్రా కూడా చేరనున్నాడు. చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో ఆడిన బుమ్రా.. వెన్నుకు సంబంధించిన…
పాకిస్థాన్కు సొంతగడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను 0-3 తేడాతో పాకిస్థాన్ కోల్పోయింది. మంగళవారం ముగిసిన మూడో టెస్టులో పాకిస్థాన్పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. 167 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 28.1 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. బెన్ డక్కెట్(78 బంతుల్లో 12 ఫోర్లతో 82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్(35…
Team India: టీమిండియాలో ఇటీవల అన్యాయానికి గురైన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే సంజు శాంసన్ ఒక్కడే. టీ20లలో రాణిస్తున్నా టీ20 ప్రపంచకప్ కోసం అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. పోనీ ఆ టోర్నీ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనా శాంసన్కు పెద్దగా ఆడే అవకాశం కల్పించలేదు. కేవలం ఒక్కటే మ్యాచ్కు తుది జట్టులో స్థానం కల్పించారు. మళ్లీ ఆరో బౌలర్ కోసం శాంసన్ను పక్కనపెట్టారు. టీమిండియాలో ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానానికి పోటీ తీవ్రంగా ఉన్న మాట వాస్తవం.…
Team India: ఒకవైపు ఆటలో రాణిస్తున్నా జాతీయ జట్టులో స్థానం దక్కకపోతే ఏ ఆటగాడికైనా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా, దేశవాళీ టోర్నీలలో రాణిస్తున్నా ఎంతో కాలంగా జాతీయ జట్టులో స్థానం కోసం జయదేవ్ ఉనద్కట్ ఎదురుచూస్తున్నాడు. అయితే ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించింది. బంగ్లాదేశ్ పర్యటన కోసం ప్రకటించిన టెస్టు జట్టులో సభ్యుడు మహ్మద్ షమీ గాయం కారణంగా తప్పుకోవడంతో అనూహ్యంగా జయదేవ్ ఉనద్కట్కు సెలక్టర్ల నుంచి పిలుపు…
నేడు రాజ్భవన్కు వైఎస్ షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతన్న సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆమె పాదయాత్రపై దాడికి పాల్పడ్డారు. అయితే.. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. అయితే.. అరెస్టు అనంతరం బెయిలపై వచ్చిన షర్మిల టీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదంటూ చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోశాయి. ఈ పొలిటికల్ టెన్షన్ నేడు రాజ్భవన్కు చేరుకోనుంది. వైఎస్ షర్మిల నేటి…
ఐపీఎల్ సీజన్ 2022లో జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో జట్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే నేడు ముంబాయిలోని వాంఖడే స్టేడియం వేదిక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో గుజరాత్ టైటాన్స్ జట్టు తలపడునుంది. అయితే ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఈ మ్యాచ్ 67వ మ్యాచ్ కాగా.. ఇప్పటికే గుజరాత్ ప్లే ఆఫ్కు…