Team India: బీసీసీఐకి షాక్.. సంజు శాంసన్కు ఇతర దేశం నుంచి ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీమిండియాలో ఇటీవల అన్యాయానికి గురైన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే సంజు శాంసన్ ఒక్కడే. టీ20లలో రాణిస్తున్నా టీ20 ప్రపంచకప్ కోసం అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. పోనీ ఆ టోర్నీ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైనా శాంసన్కు పెద్దగా ఆడే అవకాశం కల్పించలేదు. కేవలం ఒక్కటే మ్యాచ్కు తుది జట్టులో స్థానం కల్పించారు. మళ్లీ ఆరో బౌలర్ కోసం శాంసన్ను పక్కనపెట్టారు. టీమిండియాలో ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానానికి పోటీ తీవ్రంగా ఉన్న మాట వాస్తవం. అయితే పదే పదే విఫలమవుతున్న పంత్కు అవకాశాలు ఇస్తూ టాలెంట్ ఉన్న ఆటగాడిని పక్కనపెట్టడం అభిమానులకు నచ్చడం లేదు. దీంతో బీసీసీఐని శాంసన్ అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Read Also: Bangalore: అర్ధరాత్రి రోడ్డుపై నడిచినందుకు దంపతులకు రూ.3వేలు జరిమానా
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
తాజాగా టీమిండియాలో సరిపడా అవకాశాలు రాక శాంసన్ ఆవేదనకు గురవుతుండటంతో ఇతర దేశం నుంచి అతడికి ఆఫర్ వచ్చింది. శాంసన్కు ఐర్లాండ్ ఆహ్వానం పంపింది. తమ దేశం తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలని శాంసన్కు ఐర్లాండ్ దేశం కబురు పంపినట్లు ఇన్సైడ్ స్పోర్ట్ తన కథనంలో పేర్కొంది. అన్ని వదిలేసి తమ దేశం వస్తే ఆడేందుకు అవకాశం ఇస్తామని ఐర్లాండ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఐర్లాండ్ ఆఫర్ను సంజు శాంసన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాను టీమిండియాకే ఆడతానని సంజు శాంసన్ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై సంజు శాంసన్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సంజు శాంసన్ అన్ని ఫార్మాట్లలో ఇప్పటివరకు కేవలం 27 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. టీమిండియాలో దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్ వంటి కీపర్లు అందుబాటులో ఉండటంతో శాంసన్కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే తాజా పరిణామం బీసీసీఐని షాక్కు గురిచేసేది అనే చెప్పాలి. ఐర్లాండ్ గుర్తించిన టాలెంట్ను బీసీసీఐ ఎందుకు గుర్తించడం లేదని శాంసన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!