కన్నడలో గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సీరియల్ కిల్లర్ మూవీ గరుడ పురాణ.. ఎడిటర్ మంజునాథ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సైకో కిల్లర్ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు అయ్యింది.. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. ఈ సస్పెన్స్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను ఉచితంగా అమెజాన్లో చూసే వెసులుబాటు లేదు.…
పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని.. ఈవీఎంలు ధ్వంసం చేశారని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందన్నారు. డేటా భద్రంగా ఉండటం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది.. టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. 2021లో విక్కీ కౌషల్ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటోంది.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా కత్రినా బేబీ బంప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. కత్రినా కైఫ్,…
మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై సీరియస్ అయిన సీఈసీ.. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మాచర్ల సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముకేష్కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదు పంపింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం సంఘటనపై ఏపీ సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం వివరణ అడిగింది.
ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే ఇంకా మకాం వేసింది. మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఉన్నారు.
విశాఖ-హైదరాబాద్ జన్మభూమి రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జన్మభూమి రైలును విశాఖలో నిలిపివేశారు. ఉదయం 6.20 గంటలకు బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్ తెగిపోగా.. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును విశాఖ స్టేషన్కు తీసుకువచ్చారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అపర భక్తురాలైన తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు మే 22వ తేదీన తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యాణవనంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.. అందుకే తెలుగులో కూడా అజిత్ పేరు అందరికి సుపరిచితమే.. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు చేస్తుంటాడు.. అందరికీ నచ్చేలా ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలను చేస్తాడు. అజిత్ గతంలో చేసిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమాలో నటిస్తున్నారు.. తాజాగా ఈ…
నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు పరిసరి ప్రాంతంలో ఆరించి ఉన్న ఉపరితల ఆవర్తన కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునున్నట్లు తెలిపింది.