Anvesh Reddy : రైతులను ఆడుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజులుగా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బచేసే కుట్ర చేస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, అసలు సన్నాలు, దొడ్డు ఓట్లు ఎంత రైతులు పండిస్తారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. సన్నలు ఈ ఏడాది 14 లక్షల ఎకరాలు, 32 లక్షల దొడ్డు ఒడ్లు పండిస్తున్నారని, రైతులను ఆడుకునే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉందన్నారు అన్వేష్ రెడ్డి. సన్నలకు, దొడ్డు వడ్లకు కేంద్రం ఓకే ధర ఇస్తుందని, సన్నలకు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి మిల్లర్లు అదనపు ధర తో కొనుగోలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కూడా జనగామ ఎన్నికల ప్రచారంలో సన్నలకు 150 బోనస్ ఇస్తాం అని అన్నారని, బాయిల్డ్ రైస్ మాత్రమే కేంద్రం తీసుకుంటున్నది.. దొడ్డు వడ్లు మాత్రమే బయిల్డ్ రైస్ వస్తుందన్నారు. 24 లక్షల మెట్రిక్ టన్నులు ఏడాదికి రేషన్ బియ్యం ప్రజలకు అందిస్తున్నామని, ఆ రేషన్ బియ్యం మిల్లర్ల వద్ద రీసైక్లింగ్ అవుతుందన్నారు.
అంతేకాకుండా..’PDS ద్వారా సన్నలు ఇవ్వాలి అంటే ఇక్కడ సన్నల పంట అవసరం. సన్నలలో అనేక తేడాలు ఉంటాయి. BPT లో మాత్రమే నూక శాతం ఎక్కువ ఉంటుంది.. ఇతర రకాలలో దిగుబడి రెండు కిలోల తేడా మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో సన్నాలు పండించే అవకాశాలు ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి సన్నలు దిగుమతి చేసుకుంటున్నాం. దొడ్డు వడ్లు ఆదుకునే భాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తప్పక ఆదుకునే ఆలోచన చేస్తుంది. రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవ్వాళ రైతులకు మూడు రోజులలోనే ప్రభుత్వం సేకరించిన ధాన్యం డబ్బులు వస్తున్నాయి. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది. గతంలో ఐదు నుంచి పది కిలోల తరుగు తీశారు. రైతులకి కాంగ్రెస్ పాలనలో లబ్ధి జరుగుతుంది. తడిసిన ధాన్యం కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో మిలర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకోలేదా..? ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వండి స్వీకరిస్తాం. కేసీఆర్ మొదట సన్నకు వేయమన్నారు… తర్వాత వరి వేస్తే ఉరే అన్నారు.. కేంద్రం మెలిక పెట్టింది అని తప్పించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన తప్పులు చేశారు కాబట్టి మిగిలిన వారు అలానే చేశారు అనుకుంటున్నాడు.’ అని అన్వేష్ రెడ్డి అన్నారు.
Also Read
- Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
తాజావార్తలు
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
-
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!