హర్యానా ప్రభుత్వం శనివారం నాడు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బదిలీలు సాధారణమే అయినా తాజాగా బదిలీ అయిన ఐఏఎస్ అధికారికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన బదిలీ కావడం తన 29 ఏళ్ల సర్వీసులో ఇది 54వ సారి కావడం విశేషం. ఆయన పేరు అశోక్ ఖేంకా. ఆయన హర్యానా ప్రభుత్వ ఆర్కివ్స్, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్టుమెంట్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు. Read Also: పిల్లలకు హోంవర్క్…
టీ 20 ప్రపంచకప్ అసలు పోరు షురూ అయ్యింది. సూపర్-12 ఓపెనింగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరిగింది. ఈ మ్యాచ్లో తక్కువ స్కోర్లు నమోదైనా క్రికెట్ ప్రియులకు కావాల్సినంత ఉత్కంఠ లభించింది. అయితే ఒత్తిడికి చిత్తయిన దక్షిణాఫ్రికా చివరకు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ టర్న్ అవుతుండటంతో పరుగులు సులభంగా రాలేదు. దీంతో పాటు ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. హేజిల్ వుడ్,…
రాష్ట్రమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎక్కడికి వచ్చి మాట్లాడినా అందులో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తప్పక ఉంటోంది. ఈ రోజు కేటీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్, పీసీసీ రేవంత్ రెడ్డిలు రహస్య ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్, ఈటల భేటీ…
కరోనా కారణంగా గత సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారు. వారు ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ఒక…
వివాదాస్పద సినిమాలు తీస్తూ ఎప్పుడూ బీజీగా ఉండే డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కొండామురళికి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘కొండా మురళి గారికి, కొండా చిత్ర యూనిట్ నుంచి, మరియు నల్ల బల్లి సుధాకర్ గారి నుంచి, జన్మ దిన శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం కొండా అనే టైటిల్ తో కొండా మురళిపై ఆర్జీవీ సినిమా షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్ కౌంటర్ చేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకు…
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో బీజేపీ తరుఫున ప్రచారం చేసేందుకు కేంద్ర పశు సంవర్థక, మత్స్య, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ రానున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బద్వేల్ కు కేంద్ర మంత్రి మురుగన్ చేరుకోనున్నారు. అనంతరం తొలుత పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ రోడ్ షోలో పాల్గొని, నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రసంగించనున్నారు.…
తిరుపతిలో అర్థరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వెస్ట్ చర్చ్ సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద వాహనం నీట మునిగింది. దీంతో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. అతికష్టం మీద ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు. కానీ సంధ్య అనే మహిళ ఊపిరాడక మృతి చెందింది. వీరితో పాటు ప్రయాణిస్తున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వాహనం వదిలి డ్రైవర్ పరారైనట్లు సమాచారం. ఇప్పటికే వాతావరణ శాఖ…
హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారంలో వేడి పెరుగుతోంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ సిగ్గులేని రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు దిగుతోందని బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ గెలిచే పరిస్థితే ఉంటే.. దాడులకు దిగుతుందా..? అని ప్రశ్నించారు. బీజేపీ ఫ్రెస్టేషన్లో ఉందని, కిషన్ రెడ్డి తన స్థాయిని మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. Read Also…
ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్టు శుభవార్త చెప్పింది. ఈ రోజు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఫలితాల విడుదల అనంతరం ఈ నెల 26 నుంచి నవంబర్ 2వరకు రీ వాల్యూవేషన్, రీ వెరిఫికేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని బోర్టు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రీ వాల్యువేషన్ కు రూ.260, రీ వెరిఫికేషన్ కొరకు రూ.1300 చెల్లించాల్సి…
డెన్మార్క్ ఓపెన్ నుంచి భారత స్టార్ బ్యాడ్మింటర్ ప్లేయర్ పీవీ సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆమె కొరియాకు చెందిన సీడ్యన్ సియాంగ్తో జరిగిన మ్యాచ్లో 11-21, 12-21 తేడాతో పోరాడి ఓటమి పాలైంది. దీంతో ఆమె సెమీస్కు వెళ్లకుండా ఇంటి దారి పట్టింది. ప్రి క్వార్టర్స్లో ఆమె 67 నిమిషాల పాటు పోరాడగా.. ఈ పోరులో మాత్రం ఆమె 36 నిమిషాలకే చేతులెత్తేసింది. Read Also: సూపర్-12లోకి…