Home
Latest News
Latest News News
-
టీవీఎస్ స్కూటీ అరుదైన రికార్డు
టీవీఎస్ సంస్థకు చెందిన టూ వీలర్ వాహనాలలో స్కూటీలకు ఉన్న ప్రత్యేకతే వేరు. భారత్లో టీవీఎస్ స్కూటీలు ఎంత ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీవీఎస్ స్కూటీల విక్రయాలు భారత్లో 50 లక్షల మైలురాయికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా టీవీఎస్ సంస్థ వెల్లడించింది. మూడు దశాబ్దాలుగా తమ స్కూటీ వాహనాలకు మహిళలకు మెరుగైన ఎంపికగా ఉన్నందుకు తమకు గర్వగా ఉందని ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇతర కంపెనీలతో పోలిస్తే తమ… -
ప్రేమ మత్తు.. యువతి ఇంటిని తగులబెట్టిన యువకుడు
హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో పలువురు యువకులు మత్తుకు బానిసై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్, మల్లికార్జునా నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… స్థానికంగా నివాసం ఉండే నవీన్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడ్డాడు. నవీన్ మత్తుకు బానిసై చిల్లరగా తిరుగుతూ తన కూతురు వెంటపడుతున్నాడని యువతి… -
సమంత కేసు… యూట్యూబ్ ఛానళ్లకు షాక్
తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యక్తిగత జీవితంపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేయడంతో హీరోయిన్ సమంత హైదరాబాద్లోని కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మంగళవారం కూకట్ పల్లి కోర్టులో వాదనలు జరగ్గా.. సమంతకు ఊరట కలిగేలా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. సమంత వ్యక్తిగత వివరాలను ఎవ్వరూ ప్రసారం చేయడానికి వీలు లేదని కూకట్ పల్లి కోర్టు స్పష్టం చేసింది. Read Also: యంగ్ హీరోకు సాయంగా బన్నీ… -
టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న ద్రవిడ్
భారత జట్టు మాజీ ఆటగాడు, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖరారైంది. ఇటీవల నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ పదవికి రాజీనామా చేసిన అతడు… మంగళవారం నాడు టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు సమర్పించాడు. ద్రవిడ్తో పాటు అతడి సన్నిహితుడు పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, హర్యానాకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్… -
కాంగ్రెస్ పార్టీ నేతలకు సోనియా వార్నింగ్
దేశంలో వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం నాడు ఆ పార్టీ ముఖ్య నేతలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కీలక విషయాలను ప్రస్తావించారు. వివిధ రాష్ట్రాలలో నేతల మధ్య సమన్వయం కొరవడిందని.. వారి మధ్య వారికే స్పష్టత కరువైందని సోనియా అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలపై పోరాడాలో కూడా కొంతమంది నేతలకు తెలియడం లేదని ఆమె ఫైర్ అయ్యారు.… -
పెరుగుతున్న కరోనా కేసులు.. చైనాలో మళ్లీ లాక్డౌన్
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కొన్నిరోజులుగా అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. చైనా వ్యాప్తంగా సోమవారం 29 కరోనా కేసులు నిర్ధారణ కాగా.. అందులో ఆరు కేసులు చైనా వాయువ్య ప్రావిన్సు గాన్సు రాజధాని లాన్జౌలో నమోదయ్యాయి. దీంతో 40 లక్షల జనాభా గల లాన్జౌ నగరంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు అత్యవసరం అని భావిస్తే మాత్రమే ఇళ్ల… -
వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం
తెలంగాణలో ఆంత్రాక్స్ చాప కింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోయాయి. గొర్రెల వరుస మరణాలను ఆంత్రాక్స్ కారణమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాంబయ్య అనే వ్యక్తి పెంచుకుంటున్న గొర్రెల మందలో కొన్నిరోజులగా రోజుకొక గొర్రె చనిపోతుండటంపై పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు పశువైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వైద్యులు చనిపోయిన… -
29 నెలలైంది.. మీరు ఏం చేశారు : దేవినేని ఉమ
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటునే.. మరో వైపు గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వారి మాటలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చి 29 నెలలు గడిచినా… -
కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
టీఆర్ఎస్ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్ వేదికగా హైటెక్స్ లో ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా 9వ సారి కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బడుగు, బలహీన వర్గాలు కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు. అన్ని కులాలను, వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కేసీఆర్ లక్ష్యమని, దళితులకు… -
భక్తులకు షాక్.. శ్రీశైలంలో స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేత..
శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల కార్తీకా మాసం. రానున్న కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీకమాసం సందర్భంగా కార్తీకమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రూ.5వేల గర్భాలయ అభిషేకం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కార్తీకమాసోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు… ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
-
Indane Xtralite Now: ఇండేన్ ఎక్స్ట్రాలైట్ నౌ ప్రారంభం.. తేలికైన LPG సిలిండర్, 4 గంటల్లో హోమ్ డెలివరీ.. బుకింగ్ ఇలా..
-
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ నినాదంతో వేడుకలు!
-
Kawasaki Ninja 250: కవాసకి నింజా 250 విడుదల.. మిలమిల మెరిసే కొత్త కలర్స్, పవర్ఫుల్ ఇంజన్.. ధర ఎంతంటే?
-
Sri Sri: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్దే కెమిస్ట్రీ అదిరిపోయిందిగా.. ‘శ్రీ శ్రీ’ నుంచి ‘బొమ్మ బొమ్మ’ సాంగ్ రిలీజ్.!
ట్రెండింగ్
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!