Varalaxmi Sarathkumar: తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్కుమార్. ఇప్పుడు ఆమె దర్శకురాలిగా తన మొదటి చిత్రం ‘సరస్వతి’తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..” డైరెక్టర్ గోపీచంద్ మలినేని సార్ నా గురువు, మెంటార్, గైడ్.. ఆయన కారణంగానే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఆయనే నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు” అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఇండస్ట్రీ లో అమ్మాయిలు సర్వైవ్ అవడం చాలా కష్టం, వారికి సపోర్ట్ ఇవ్వండి అని కోరారు.
ఇకపోతే ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరస్వతి’ ట్రైలర్ విషయానికి వస్తే.. కనబడకుండా పోయిన కూతురి కోసం ఒక అమ్మ ఎంత దూరం వెళ్తుందో.. అనే స్టోరీ లైన్తో ఈ ట్రైలర్ సాగుతుంది. పోలీస్ స్టేషన్లో ఆందోళనతో కూర్చున్న వరలక్ష్మి.. కోర్టు డ్రామా.. రివెంజ్ ఎలిమెంట్స్.. అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక భిన్నమైన థ్రిల్లర్గా మార్చాయి. ప్రియమణి, ప్రకాష్ రాజ్, కిషోర్ వంటి బలమైన నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. తమన్ సంగీతం ఇప్పటికే సినిమాపై హైప్ను పెంచేసింది. ‘దోసా డైరీస్’ బ్యానర్పై ఈ చిత్రాన్ని వరలక్ష్మి శరత్కుమార్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ‘సరస్వతి’ సినిమా థియేటర్లలోకి రాబోతోందని చిత్ర బృందం తెలిపింది.
READ ALSO: Realme P4 Lite: కేవలం రూ.7,999 కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్లు!