Smriti Mandhana: ప్రేమ విఫలమైనా.. ఆటలో మాత్రం తగ్గేదేలే! ఆర్సీబీకి కప్పు.. ఆసీస్పై సిరీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: సాధారణంగా బ్రేకప్ జరిగిన తర్వాత లవర్స్ ఏం చేస్తారు. బాగా బాధ పడతారు! ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల టైమ్ పడుతుంది. కొందరు సున్నిత మనసున్న అమ్మాయిలు, అబ్బాయిలు అఘాయిత్యాలకు పాల్పడుతారు. తాగుతూ జీవితం ఇక్కడితో అయిపోయిందని భావిస్తారు. కానీ.. కొందరు మాత్రం స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తారు. ఈ కమ్బ్యాక్ చూసిన తర్వాత తనను వదిలేసిన అమ్మాలి లేదా అబ్బాయి కుళ్లి కుళ్లి ఏడ్చేలా చేస్తారు. అచ్చం లాంటి ఘటనే తాజాగా క్రికెట్ ప్రపంచంలో చోటు చేసుకుంది. బ్రేకప్ తర్వత ఎలాంటి అసహనానికి లోను కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్తోంది టీమిండియా ఉమెన్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన. ఇటీవల తన అద్భుతన ప్రదర్శనతో మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజయానికి చేరువ చేసింది. ఎలాంటి భయం లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ మహిళల జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి రెండోసారి డబ్ల్యూపీఎల్ కప్ను సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో స్మృతి మంధాన పాత్ర అసాధారణం. ఆమె బ్యాట్ పట్టినప్పటి నుంచి మ్యాచ్ మీద ఆర్సీబీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కేవలం 41 బంతుల్లో 87 పరుగులు చేసి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానకు ఇది మామూలు మ్యాచ్ కాదు.. బ్రేకప్ తర్వాత స్ట్రాంగ్ కమ్బ్యాక్ అనే చెప్పాలి.
READ MORE: Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ చొరవ.. కొణిదెల గ్రామానికి మహర్దశ
Also Read
- Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం 'క్లాడ్ ఫర్ లీగల్'ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
- Emergency Landing: పొలంలో శిక్షణా విమానం అత్యవసరంగా ల్యాండ్..!
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
ఇదిలా ఉండగా.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై భారత లేడీ సింగం స్మృతి మంధాన మరోసారి గర్జించింది. కంగారూ సొంత గడ్డలో ఆ టీమ్ను 17 పరుగుల తేడాతో ఓడించారు. టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన బాధ్యతాయుతంగా ఆడి కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు స్కోర్ చేసి జట్టును నిలబెట్టింది. 149.09 స్ట్రైక్ రేట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించి ఆ తర్వాత గేర్ మార్చింది మంధాన.. మెంబర్స్ స్టాండ్లోకి కొట్టిన ఓ భారీ సిక్సర్ హైలైట్గా నిలిచింది. పేసర్ డార్సీ బ్రౌన్ బౌలింగ్లో సిక్సర్ బాది 38 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. తన 160వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆమెకు ఇది 33వ అర్ధశతకం. ఇలా కీలక మ్యాచ్లలో స్మృతి మంధాన ఆడుతున్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
READ MORE: India vs Australia: ఆసీస్ గడ్డపై గర్జించిన భారత మహిళలు.. పదేళ్ల తర్వాత హిస్టరీ రిపీట్!
తాజావార్తలు
-
Peddi : అదిరిందిపోయిన రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రోమో..
-
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
-
Kirrak Seetha: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన ఆరోపణలు!
-
IPL 2026 Playoffs Scenario: గుజరాత్ ఘన విజయం.. తగ్గిన ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఛాన్సెస్.. సీఎస్కేకు ప్లస్!
-
Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!