ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని చుట్టేసే పనిలో పడిపోయారు.. నిత్యం ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తున్నారు.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు.. ఇక, ఇవాళ కర్నూలు జిల్లాకు వెళ్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా వద్ద ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ఇవాళ ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కర్నూలు పర్యటనకు బయలుదేరనున్నారు సీఎం జగన్… అక్కడి నుంచి గుమ్మటం…
ఈవెంట్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలావరకు సెటిల్డ్గానే ఉంటారు. వస్తారు, అభిమానుల్లో జోష్ నింపే ప్రసంగం ఇస్తారు, వెళ్ళిపోతారు.. అంతే తప్ప స్టెప్పులేసిన దాఖలాలు లేవు. అలాంటి మహేశ్.. తొలిసారి కర్నూలులో జరిగిన ‘సర్కారు వారి పాట’ సక్సెస్లో మీట్లో వేదికపై స్టెప్పులేశారు. తొలుత తమన్ వేదికపైకి వెళ్ళి డ్యాన్సర్లతో స్టెప్పులు కలపగా, ఆ వెంటనే మహేశ్ స్వయంగా వేదికెక్కి తన ‘మ మ మహేశ్’ పాటకి ఎనర్జిటిక్గా స్టెప్పులు వేశారు. దీంతో, ఆ ప్రాంగణం…
ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల…
సోషల్ మీడియాను కొందరు మంచి పనుల కోసం వినియోగిస్తోంటే, మరికొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరైతే ఏకంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అందమైన అమ్మాయిల్ని టార్గెట్ చేసి రిక్వెస్టులు పెట్టడం, యాక్సెప్ట్ చేశాక మాయమాటలు చెప్పి వలలో వేసుకోవడం, ఆ తర్వాత బ్లాక్మెయిల్కి పాల్పడ్డం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకోగా, తాజాగా మరో వ్యవహారం తెరమీదకొచ్చింది. Read Also: YCP Leader Murder Case: పథకం ప్రకారమే వైసీపీ నేత హత్య.. ఆ…
దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ముందు వర్షాలతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారింది. విశాఖలో చల్లని, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ప్రధాన వీధులన్నీ జలమయం అయ్యాయి. శ్రీశైలంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో భక్తులు…
ఏపీలో మూడురాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలులో ఇంతకుముందే ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి ప్రారంభించారు. ఇంతవరకు హైదరాబాద్లో కొనసాగిన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలను ఇకపై కర్నూలు నుంచి నిర్వహిస్తారు. తాజాగా కర్నూలు సంతోష్ నగర్ లో లోకాయుక్త నూతన కార్యాలయాన్ని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు.…
రెండు రోజుల పాటు కడప, కర్నూలు జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి… ఇవాళ సాయంత్రం కడప ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న ఆయన.. 5.40 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. ఇక, రాత్రి 7.20 గంటలకు టీటీడీ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి.. రాత్రి 7.30 నుంచి 7.40 గంటల మధ్య కోదండరామస్వామి ఆలయానికి చేరుకుంటారు.. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…
ఆదమరిస్తే దొంగనోట్లతో బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్ళు. నెల్లూరు జిల్లా కావలి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దొంగనోట్లు చలామణి చేస్తున్న దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు కావలి రూరల్ పోలీసులు. వారి వద్ద నుంచి లక్షా నలభై ఏడు వేల రూపాయలు 500 రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు.నెల్లూరు జిల్లా కావలి, కావలి రూరల్ పరిసర ప్రాంతాల్లో కావలి పట్టణ ప్రాంతంలో దొంగనోట్ల చలామణి భారీగా జరుగుతోంది. గత కొన్ని రోజులుగా దొంగ నోట్లు బయటపడుతున్నాయి. కావలి అడిషనల్…
దుండగులు కిరాతకానికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లాలో ఏపీ హైకోర్టు న్యాయవాది వి.వెంకటేశ్వర్లును దారుణంగా హతమార్చారు. కర్నూలు నగర శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని గుర్తించారు పోలీసులు. హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. ఆవుల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఈ నెల 7 వ తేదీనుంచి ఆయన కనిపించడం లేదు. ఆయన అదృశ్యంపై కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చింతకుంటలో తమ్ముని వద్దకు వెళ్లి తిరిగివస్తూ…
మానవత్వం మసిబారిపోతోంది. డబ్బుల కోసం, కక్షలతో అయినవారిని కడతేరుస్తున్నారు. కర్నూలు జిల్లాలో కన్నకొడుకు కర్కశంగా మారిపోయాడు. గోనెగండ్ల లో ఆస్తి కోసం తండ్రిని హత్య చేశాడా తనయుడు. తండ్రిని హత్య చేసి గోనె సంచిలో కట్టి తుంగభద్ర దిగువ కాలువలో పడేశాడు కొడుకు. ఈనెల న 17న గోనెగండ్ల సమీపంలో తుంగభద్ర కాలువలో గుర్తు తెలియని మృతదేహం గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. నివ్వెర పోయే చేదు నిజాలు దర్యాప్తులో…