ఏపీలో ఐఏఎస్ అధికారులపై రాష్ట్ర హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు సీరియస్ అయింది. కోర్టుకు హాజరైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, రావత్, కొన శశిధర్ పై మండిపడింది. కర్నూలులో ప్రభుత్వం డబ్బు ఇవ్వకపోవడంతో ఆత్మ హత్య చేసుకున్న కాంట్రాక్టర్ వ్యవహారంపై అధికారులను నిలదీసింది హైకోర్టు. ఆ కుటుంబానికి ఎవరు ఆసరా కల్పిస్తారని ప్రశ్నించారు హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్. అన్ని ఆర్డర్స్లో కోర్టు…
గత కొంతకాలంగా సైలెంట్ గా వున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పీడ్ పెంచారు. నంద్యాల జిల్లా చాగలమర్రిలో అక్రమ కూల్చివేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అఖిలప్రియ. ఇంటిస్థలంపై కోర్టులో కేసు నడుస్తుండగానే పోలీసుల్ని, అధికారుల్ని ముందుపెట్టుకొని ఇంటిని కూల్చారంటూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి అఖిల ప్రియ. టీడీపీ ప్రభుత్వం రాగానే మీ కంటే రెండింతలు ఎక్కువ చేస్తాం అంటూ వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు అఖిలప్రియ. వైసీపీ నాయకులకు ఓర్పు లేక, తీవ్రమైన…
శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలంలో మంగళవారం, శుక్రవారాలలో స్వామివారి ఉచిత స్పర్శదర్శనం వుంటుంది. అయితే ఈ ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేశారు దేవస్థానం అధికారులు. శ్రీ శైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మంగళవారం నుండి శుక్రవారం వరకు భక్తులకు కల్పిస్తున్న మల్లికార్జునస్వామి స్పర్శ దర్శన వేళలు మార్చాలని దేవస్థానం నిర్ణయించింది. నేటినుండి నుంచి వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు…
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు మొదలు.. మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు అధికారపార్టీ వైసీపీ విజయఢంకా మోగించింది. రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ, 8 మున్సిపాలిటీలు.. 53 జడ్పీటీసీ, 53 ఎంపీపీ అన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇవి కాకుండా ముగ్గురు ఎమ్మెల్సీలు.. మరెన్నో కార్పొరేషన్ల ఛైర్మన్లు.. డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. కర్నూలు నగరంలో బలమైన వైసీపీ నేతలకు కొదవ లేదు. ఇంతమంది ఉన్నప్పటికీ సామాజిక న్యాయభేరి పేరిట చేపట్టిన బస్సుయాత్రను లైట్ తీసుకున్నారు.…
కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక.. కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాల్లో ఆంటీముట్టనట్టు ఉంటున్నారట. కర్నూలు ఎంపీగా ఉన్నపుడు నిత్యం ప్రజల్లో ఉన్న బుట్టా రేణుక.. కరోనా పూర్తిగా తగ్గిపోయాక కూడా యాక్టివ్గా లేకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోందట. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. తన రాజకీయ భవిష్యత్పై ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారట బుట్టా రేణుక. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న రేణుక.. సీటు ఖరారు చేయాలని వైసీపీ అధిష్టానాన్ని…
ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో మూడు కుటుంబాల నుంచి గతంలో ఇద్దరు చొప్పున పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కేఈ కృష్ణమూర్తి కుటుంబంలో పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్ పోటీ చేశారు. కోట్ల కుటుంబంలో కర్నూలు ఎంపీగా సూర్యప్రకాష్రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాత బరిలో ఉన్నారు. భూమా ఫ్యామిలీ నుంచి ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఎన్నికల గోదాలోకి దిగారు. ఇప్పుడు ఈ కుటుంబాల నుంచి వచ్చే…
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన రొటీన్కు భిన్నంగా సాగింది. కర్నూలు సమావేశంలో పార్టీ కేడర్ స్పందన, రోడ్ షోలకు లభించిన ఆదరణకు ఫుల్ ఖుషీ అయ్యి కీలక ప్రకటన చేశారు. డోన్ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును ప్రకటించారు. బాబు నోటి వెంట ఈ ప్రకటన రాగానే పార్టీ శ్రేణులు నివ్వెర పోయాయి. ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించిన ఉదంతాలు లేకపోవడంతో అది చర్చగా మారింది. దీని వెనక టీడీపీ వ్యూహం…
ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన భిన్నంగా జరిగింది. కేడర్ నుంచి వచ్చిన స్పందన చూశాక.. ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారో ఏమో.. డోన్ టీడీపీ అభ్యర్థిగా సుబ్బారెడ్డి పేరును ప్రకటించేశారు. ఈ స్టేట్మెంట్పై టీడీపీతోపాటు జనసేన కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయాయట. ఒక్క డోన్లోనే కాదు.. చంద్రబాబు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు.. కొన్ని రోజులుగా పొత్తులపై పదే పదే మాట్లాడుతున్నారు. అందరూ…
కర్నూలు జిల్లా, తుగ్గలి (మం) జొన్నగిరిలో వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడ కూలీలు, సామాన్య జనాలు ఒకటే హడావిడి. వజ్రాల వేటకు బయలుదేరతారు. తాజాగా కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. పొలం పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు దొరికిన రెండు వజ్రాలను వ్యాపారులు కొనేశారు. అది కూడా తక్కువ ధరకే అని తెలుస్తోంది. ఓ వజ్రాన్ని రూ.45 వేలకు, జత కమ్మలు ఇచ్చి కొన్నట్లు సమాచారం. మరొక వజ్రాన్ని రూ.35 వేలు ఇచ్చి కొనుగోలు చేశారు వ్యాపారులు.…
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో కూల్ అండ్ కామ్ గా ఉండే హీరో ఎవరు అంటే టక్కున మహేష్ అని చెప్పేస్తారు. వివాదాల జోలికి పోడు, నెగెటివ్ కామెంట్స్ చేయడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఈవెంట్ ఏదైనా మహేష్ మాత్రం మితంగానే మాట్లాడతాడు. అనవసరమైన హైప్ ఇవ్వదు.. అనవసరమైన ప్రామిస్ లు చేయడు. వేదికల మీద డైలాగ్స్, స్టెప్పులు వేసింది కూడా ఇప్పటివరకు లేదు అంటే…